గోవధ నిషేధ బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం

KarnatakaPasses Anti-Slaughter Bill In Assembly కర్ణాటకలో గోవధను నిషేధించేందుకు ప్రవేశపెట్టిన ‘ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ కాటిల్ బిల్-2020’ను బుధవారం(డిసెంబర్-9,2020)ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్రంలో ఎక్కడైనా, ఎవరైనా గోవులను చంపినా, హింసకు పాల్పడినా ఈ చట్టం ద్వారా వారికి కఠిన శిక్షలు విధించనున్నారు.
అయితే, ఇవాళ ఈ బిల్లును ళ కర్ణాటక అసెంబ్లీలో పశుసంరక్షణ మంత్రి ప్రభు చవాన్ ప్రవేశపెట్టిన కొద్ది సేపటికే సభలో గందరగోళం నెలకొంది. విపక్షలు స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లి నిరసన చేపట్టాయి. వ్యాపార సలహాదారు కమిటీ సమావేశంలో ఈ బిల్లు గురించి తమకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి కొత్త బిల్లులను ప్రవేశపెట్టకూడదని నిర్ణయించినట్టు.. కేవలం ఆర్డినెన్స్ల ఆమోదానికే అంగీకరించినట్టు.. కానీ ప్రభు చవాన్.. అనూహ్యంగా సభలో బిల్లు ప్రవేశపెట్టారని విపక్షాలు మండిపడ్డాయి. ఈ గందరగోళం మధ్యే బిల్లుకు ఆమోదం లభించింది.
బీఫ్ ని పశువుల మాంసం (13 ఏళ్ల లోపు ఆవు, దూడ, ఎద్దు, ఎద్దు మరియు మగ లేదా ఆడ గేదె)గా ఈ చట్టం నిర్వచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు (లేదా)10 లక్షల వరకు జరిమానా విధిస్తారు.