Train Ticket: ఏసీ టికెట్ ఉండి కూడా ట్రైన్ ఎక్కలేకపోయాడు.. లైఫ్ టైం ఫ్రీ టికెట్ కావాలంటూ కామెంట్
అతడు పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుమారు 20 లక్షల మందికి ఆ పోస్ట్ రీచ్ అయింది. దీనిపై నెటిజెన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు

Vadodara Station: పండగ వచ్చిందంటే చాలు.. ఉద్యోగం, ఉపాధి, చదువు అంటూ నగరాలు, పట్టణాల్లో ఉన్న వ్యక్తులు ఇంటికి వెళ్లేందుకు రెడీ అయిపోతారు. రోజులు, నెలలకొద్ది కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడంతో పండగ రోజు ఆ లోటును తీర్చుకునేందుకు ఎన్నో కలలతో సొంత ఊరికి ప్రయాణం అవుతారు. మరి తీరా బయల్దేరాక ఏదో చేదు అనుభవంతో ప్రయాణం ఆగిపోతే ఎలా ఉంటుంది? వారి ఆశలు అడి ఆశలు అయ్యి, చెప్పలేనంత ఫ్రస్ట్రేషన్ తో ఉంటారు. ఇలాంటి అనుభవమే ఎదురైంది ఒక వ్యక్తికి.
దీపావళికి సొంతూరుకి వెళ్లేందుకు ట్రైన్ ఏసీ టికెట్ ముందుగానే బుక్ చేసుకున్నాడు. ట్రైం రాకముందు స్టేషన్ వెళ్లాడు. అయినప్పటికీ ట్రైన్ ఎక్కలేకపోయాడు. కారణం.. ట్రైన్ చాలా రద్దీగా ఉండడం. అప్పటికే ట్రైన్ ఎక్కిన వారు అతడిని ట్రైన్ ఎక్కుతుండగా బయటికి తోసేశారట. పైగా ఆ తోసేసిన వాళ్లకు టికెట్ కూడా లేదట. ఈ విషయాలు ఎక్స్ ఖాతాలో స్వయంగా రాసుకొచ్చాడు బాధితుడు. సరైన సౌకర్యాలు, భద్రత కల్పించకుండా తన దీపావళిని నాశనం చేశారంటూ అతడు రైల్వే శాఖ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయమై వరుస పోస్టులు చేశాడు.
ఇది కూడా చదవండి: 738కి.మీ. రేంజ్తో కొత్త వోల్వో ఫస్ట్ ఎలక్ట్రిక్ లగ్జరీ మినీవ్యాన్.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా..!
బాధితుడి పేరు అన్షుల్ శర్మ. వడోదరలో ఉంటున్న అతడు దీపావళికి ఊరు వెళ్లేందుకు ఏసి టికెట్ బుక్ చేసుకుని రైల్వే స్టేషన్ కు వెళ్లిన అనంతరం అతడికి ఎదురైన అనుభవం ఇది. రైల్వే స్టేషన్ లోని కొన్ని వీడియోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘నా దిపావళిని నాశనం చేసినందుకు ధన్యవాదాలు. భారతీయ రైల్వే మేనేజ్మెంట్ చాలా చెత్తగా ఉంది. 3వ ఏసీ టికెట్ ఉండి కూడా నేను రైలు ఎక్కలేకపోయాను. పోలీసులు కూడా సహాయం చేయలేదు. చాలా మంది నాలాగే రైలు ఎక్కలేకపోయారు. నా డబ్బులు తిరిగి ఇవ్వాలి’’ అని పోస్ట్ చేశాడు. అందులో రైల్వే మంత్రి అశ్విణీ వైష్ణవ్, వడోదర డీఆర్ఎంలను ట్యాగ్ చేశాడు.
PNR 8900276502
Indian Railways Worst management
Thanks for ruining my Diwali. This is what you get even when you have a confirmed 3rd AC ticket. No help from Police. Many people like me were not able to board. @AshwiniVaishnawI want a total refund of ₹1173.95 @DRMBRCWR pic.twitter.com/O3aWrRqDkq
— Anshul Sharma (@whoisanshul) November 11, 2023
అతడు పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుమారు 20 లక్షల మందికి ఆ పోస్ట్ రీచ్ అయింది. దీనిపై నెటిజెన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘‘జీవితాంతం ఉచిత ప్రయాణానికి నువ్వు డిమాండ్ చేయాలి. ప్రీమియం క్లాస్ టికెట్ తీసుకున్నాక ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడం దురదృష్టకరం’’ అని ఒక యూజర్ స్పందించారు. ‘‘సీట్ల పరిమితిని చూసి టికెట్లు కన్ఫిర్మ్ చేయాలి. అలాగే.. రైలు కోచుల వద్ద సరైన భద్రతను ఏర్పాటు చేయాలి’’ అని మరొక యూజర్ కామెండ్ చేశారు.