Uttarakhand: నమామీ గంగా ప్రాజెక్ట్ సైట్లో ట్రాన్స్ఫార్మర్ పేలి 15 మంది మృతి
అలకనంద నది తీరంలో జరిగిన ఈ పేలుడు కారణంగా 15 మంది చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని ఎయిర్ లిఫ్ట్ ద్వారా రిషికేష్ లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రికి తరలించాము

Namami Gange Project: ఉత్తరాఖండ్లోని ఛమోలి జిల్లాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. నమామి గంగే మురుగునీటి శుద్ధి కర్మాగారం ప్రాజెక్ట్ స్థలంలో పనిచేస్తున్న రెండు డజన్ల మంది ఉద్యోగులు అలకనంద నది ఒడ్డున ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15 మంది చనిపోయినట్లు ఛమోలి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ పర్మేంద్ర దోవల్ తెలిపారు. గాయాలపాలైన వారికి హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మృతుల్లో పిపాల్కోటికి ఇన్చార్జ్ కూడా ఉన్నారని ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అశోక్ కుమార్ తెలిపారు. ఇక ఈ ఘటనపై ఎస్పీ పర్మేంద్ర దోవల్ మాట్లాడుతూ ‘‘అలకనంద నది తీరంలో జరిగిన ఈ పేలుడు కారణంగా 15 మంది చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని ఎయిర్ లిఫ్ట్ ద్వారా రిషికేష్ లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రికి తరలించాము. ఐదుగురిని గోపేశ్వర్ లోని ఆసుపత్రికి తరలించాం’’ అని తెలిపారు.
“Around 15 people including a police sub-inspector & five home guards have died. Investigation is underway. Prima Facie reveals that there was current on the railing and the investigation will reveal the further details,” says Additional Director General of Police, Uttarakhand, V… pic.twitter.com/ucNI2tFzZq
— ANI (@ANI) July 19, 2023
కాగా, ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగంతో పాటు రెస్క్యూ బృందం, రాష్ట్ర విపత్తు స్పందన బృందం వెంటనే సేవల్లోకి దిగాయని పేర్కొన్నారు. క్షతగాత్రులకు ఉత్తమమైన వైద్యం కోసం హెలికాప్టర్ లు ఉపయోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
चमोली में हुई अत्यंत हृदयविदारक दुर्घटना के स्थलीय निरीक्षण हेतु घटनास्थल के लिए रवाना हो रहा हूं।
मेरी संवेदनाएं शोक संतप्त परिजनों के साथ हैं, इस संकट की घड़ी में दुर्घटना प्रभावित लोगों के आश्रितों के साथ हमारी सरकार मजबूती के साथ खड़ी है।
— Pushkar Singh Dhami (@pushkardhami) July 19, 2023
దీనిపై ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘చమోలిలో జరిగిన అత్యంత హృదయ విదారకమైన ప్రమాదం జరిగిన ప్రదేశానికి తనిఖీ చేయడానికి ఇప్పుడే బయలుదేరుతున్నాను. మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ సంక్షోభ సమయంలో మా ప్రభుత్వం ప్రమాద బాధిత ప్రజలకు అండగా నిలుస్తుంది’’ అని హిందీలో ట్వీట్ చేశారు.