బెంగళూరు-కృష్ణగిరి మార్గంలోని హోసూరు సమీపంలోని పేరండ్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నమ్మశక్యం కాని రీతిలో వాహనాలు ఢీ కొన్నాయి. గ్రానైట్తో వెళుతున్న లారీ బ్రేక్ ఫెయిల్ అయ్యి కారుని ఢీకొంది.
ఆ వెనకే వస్తున్న పలు వాహనాలు ఒకదానికోటి ఢీకొన్నాయి. మొత్తం 15 వాహనాలు ఢీ కొట్టుకున్నాయి. వాటిలో 8 కార్లు, రెండు బస్సులు, 4 లారీలు ధ్వంసమయ్యాయి. ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
వారిలో ఏడుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. క్షతగాత్రులను హోసూరు, క్రిష్ణగిరి ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు-కృష్ణగిరి హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ జరిగింది.
N convention: సవినయంగా అభ్యర్థిస్తున్నాను అంటూ మరోసారి హీరో నాగార్జున కామెంట్స్