Srinagar-Sharjah Flight : గగనతల నిరాకరణ..శ్రీనగర్‌ –షార్జా విమానానికి పాక్ ఇబ్బందులు

శ్రీనగర్‌ – షార్జా విమానం తమ గగనతలాన్ని వినియోగించుకునేందుకు పాక్‌ నిరాకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లోని షార్జా నుంచి శ్రీనగర్ మధ్య నేరుగా నడిచే గో ఫస్ట్​ ఎయిర్​వేస్​కు

Srinagar-Sharjah Flight : గగనతల నిరాకరణ..శ్రీనగర్‌ –షార్జా విమానానికి పాక్ ఇబ్బందులు

Plane (1)

Updated On : November 3, 2021 / 8:43 PM IST

శ్రీనగర్‌ – షార్జా విమానం తమ గగనతలాన్ని వినియోగించుకునేందుకు పాక్‌ నిరాకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లోని షార్జా నుంచి శ్రీనగర్ మధ్య నేరుగా నడిచే గో ఫస్ట్​ ఎయిర్​వేస్​కు చెందిన విమానాలను తమ గగనతలంలోకి ప్రవేశించకుండా పాకిస్తాన్ ఆంక్షలు విధించినట్లు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాక్‌ నిర్ణయంతో విమానం ఉదయపూర్‌, అహ్మదాబాద్‌, ఒమన్‌ మీదుగా షార్జా ప్రయాణించాల్సి ఉంటుంది.

అయితే,కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. శ్రీనగర్​- షార్జా మధ్య తొలి అంతర్జాతీయ విమాన సర్వీసులను జెండా ఊపి ప్రారంభించిన పది రోజుల్లోనే పాక్ ఇలాంటి ఆంక్షలు విధించటం చర్చనీయాంశంగా మారింది. జమ్ముకశ్మీర్ పర్యటనలో భాగంగా షార్జా- శ్రీనగర్​ మధ్య విమాన సేవలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబరు 23న ప్రారంభించిన విషయం తెలిసిందే. మరోవైపు షార్జా నుంచి బయల్దేరిన విమానం.. షెడ్యూల్ ప్రకారమే బుధవారం ఉదయం శ్రీనగర్​ చేరుకున్నట్లు ఎయిర్​పోర్ట్​ డైరెక్టర్ సంతోష్ దోకె తెలిపారు.

ఇక, పాక్ చర్య దురదృష్టకరమైనదని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. 2009-2010లోనూ పాక్ ఇలాంటి దుశ్చర్యకే పాల్పడిందన్నారు. ఆ సమయంలో శ్రీనగర్​- దుబాయ్ విమానాన్ని పాక్ అడ్డుకుందన్నారు. విమాన సర్వీసులకు మొదట అనుమతి ఇచ్చి.. తర్వాత ఆంక్షలు విధించటం సరికాదని ఒమర్ అబ్దుల్లా అన్నారు. పాక్ గగనతలంపై నుంచి ప్రయాణించడానికి గో ఫస్ట్‌కు అనుమతి లభిస్తుందని ఆశించినట్లు ఆయన ట్వీట్‌ చేశారు.

పాక్​ గగనతలం మీదుగా కశ్మీర్ విమానాలు వెళ్లేందుకు ఆ దేశాన్ని అనుమతి కోరటాన్ని కేంద్రం పట్టించుకోవటం లేదని కశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ మరో ట్వీట్ లో తెలిపారు.
ALSO READ Petrol Diesel : దేశ ప్రజలకు దీపావళి గిఫ్ట్.. పెట్రోల్, డీజిల్ ధరలపై భారీ తగ్గింపు