PM Modi: అధునాతన యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
అధునాతన యుద్ధ నౌకలు.. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్ లను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.

PM modi dedicates frontline naval combatants INS Surat INS Nilgiri and INS Vagsheer to the nation
PM Modi: అధునాతన యుద్ధ నౌకలు.. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్ లను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ముంబయిలోని నేవల్ డాక్ యార్డ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మోదీ పాల్గొన్నారు. యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు. వీటి రాకతో నౌకదళ బలం మరింత పటిష్టం కానుంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. నౌకాదళం బలోపేతానికి నేడు మరో ముందడుగు పడిందన్నారు. రెండు యుద్ధ నౌకలు, జలాంతర్గామిని ఒకేసారి ప్రారంభించామని, ఇవన్నీ భారత్ లో తయారైనవేనని, వీటితో నౌకాదళానికి నూతన బలం, దార్శనికత అందుతుందని వివరించారు.