అయ్యో పాపం.. వడాపావ్ కోసం ఆగిన వృద్ధ దంపతులు.. నగలు దోచుకెళ్లిన దొంగ.. వీడియో వైరల్
నగరానికి చెందిన వృద్ధ దంపతులు గురువారం మధ్యాహ్నం సమయంలో బ్యాంక్ కు వెళ్లారు. అక్కడ నగలు తీసుకొని (సుమారు రూ. 5లక్షలు విలువ) స్కూటర్ పై ..
Pune : పూణెలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వడాపావ్ తినేందుకు ఆగిన వృద్ధ దంపతుల నుంచి రూ. ఐదు లక్షల విలువైన నగలను దొంగ అందరూ చూస్తుండగానే దోచుకెళ్లాడు. మహిళల దొంగను వెంబడించినా ఉపయోగం లేకుండా పోయింది. పట్టపగలే రద్దీగా ఉన్న రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. అయ్యో పాపం.. అంటూ వృద్ధ దంపతుల పట్ల సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా.. ఘటన తరువాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read : క్యాబ్ డ్రైవర్ను నేలకేసి కొట్టిన దుర్మార్గుడు.. వాడిని వదలొద్దని నెటిజన్ల డిమాండ్
పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన వృద్ధ దంపతులు గురువారం మధ్యాహ్నం సమయంలో బ్యాంక్ కు వెళ్లారు. అక్కడ నగలు తీసుకొని (సుమారు రూ. 5లక్షలు విలువ) స్కూటర్ పై ఇంటికి ఇంటికి బయలుదేరారు. మార్గం మధ్యలో రోడ్డుపక్కనే ఉన్న ఓ దుకాణం వద్ద వడాపావ్ తినేందుకు ఆగారు. నగల సంచిని స్కూటర్ ముందు భాగంలో తగిలించారు. వడాపావ్ తినేందుకు బండిని రోడ్డుపక్కన ఆపారు. భర్త వడాపావ్ తెచ్చేందుకు దుకాణం వద్దకు వెళ్లగా.. రోడ్డుపక్కన ఆపిన స్కూటర్ వద్ద అతని భార్య ఉంది. వీరిని ఫాలో అవుతున్న వ్యక్తి మొఖానికి మాస్క్ వేసుకొని నెమ్మదిగా స్కూటర్ వద్దకు వెళ్లాడు.
మహిళ స్కూటర్ వెనుక వైపుకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దుండగుడు స్కూటర్ ముందు భాగంలో తగిలించిన నగలు సంచిని దొంగిలించి పరారయ్యాడు. దీన్ని గమనించిన మహిళ అతన్ని వెంబడించినా ఉపయోగంలేక పోయింది. ఊహించని ఘటనతో కంగుతిన్న వృద్ద దంపతులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ కెమెరా పుటేజ్ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
A couple’s gold jewellery valued at ₹ 4.95 lakh was stolen while they paused to buy vada pav after picking it up from a bank. The incident took place on Thursday outside a vadapav shop in Shewalewadi.#goldchain #shewalewadi #Pune #punepolice #robbery pic.twitter.com/oFYGmuTso4
— Pune Pulse (@pulse_pune) August 30, 2024