Water of 115 Nations: అయోధ్య రామాలయం కోసం 115 దేశాల నీరు
అయోధ్యలోని రామ మందిరం కోసం 115 దేశాల నుంచి నీటిని సేకరించినట్లుగా ఢిల్లీకి చెందిన ఎన్జీవో ప్రకటించింది.
![Water of 115 Nations: అయోధ్య రామాలయం కోసం 115 దేశాల నీరు Water of 115 Nations: అయోధ్య రామాలయం కోసం 115 దేశాల నీరు](https://10tv.in/wp-content/uploads/2021/08/Ayodhya-Ram-Temple.jpg)
Ayodhya Ram Temple
Water of 115 Nations: అయోధ్యలోని రామ మందిరం కోసం 115 దేశాల నుంచి నీటిని సేకరించినట్లుగా ఢిల్లీకి చెందిన ఎన్జీవో ప్రకటించింది. ఈ దేశాలలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్, చైనా, కంబోడియా మొదలైనవి ఉన్నాయి. NGO ‘ఢిల్లీ స్టడీ సర్కిల్’ ప్రకారం ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, చైనా, కంబోడియా, క్యూబా, DPR కాంగో, ఫిజి, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇండోనేషియా, ఐర్లాండ్, ఇజ్రాయెల్, జపాన్, కెన్యా, లైబీరియా, మలేషియా, మారిషస్ నీరు మయన్మార్, మంగోలియా, మొరాకో, మాల్దీవులు మరియు న్యూజిలాండ్ నుండి నీటిని తీసుకుని వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఈ ఎన్జిఓ అధిపతి, ఢిల్లీ మాజీ బీజేపీ ఎమ్మెల్యే విజయ్ జాలీ మాట్లాడుతూ.. ఎల్కె అద్వానీ, విశ్వ హిందూ పరిషత్ దివంగత అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీల స్పూర్తితో.. గత ఏడాది ఆగస్టు 5న ప్రధాని మోదీ రామ మందిరానికి శంకుస్థాపన చేశారు.
“COVID-19 మహమ్మారి కారణంగా ప్రజలు ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లలేని సమయంలో, విశ్వాసం మరియు నమ్మకంతో మా చారిత్రాత్మక మిషన్లో మేము విజయం సాధించాము. భగవంతుడు శ్రీరాముడు అయోధ్య ప్రజలచే గౌరవించబడడమే కాకుండా ఆధునిక కాలంలో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిచే ఆరాధించబడుతున్నారు. ఈ సంస్థ ఈ నీటిని వచ్చే నెలలో అయోధ్యకు పంపాలని యోచిస్తోంది.
అయోధ్యలో శ్రీరామ దేవాలయం గొప్పగా నిర్మిస్తున్నారు. 2023 సంవత్సరం చివరి నాటికి ఆలయ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. దేశం మరియు ప్రపంచంలోని ప్రజలు ఈ ఆలయ నిర్మాణానికి కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చారు.
Blessed to have procured Pure River & Ocean Water of 115 Nations of 7 Continents for Ayodhya Ram Temple.Drew inspiration from L.K.Advani,Late Ashok Singhal & PM
.@narendramodi
Jai Shree Ram.
.@ChampatRaiVHP
.@DrMohanBhagwat
.@DattaHosabale
.@rajnathsingh.@JPNadda.@AmitShah pic.twitter.com/QY5tVk2mBk— Dr.Vijay Jolly (@VijayJollyBJP) August 26, 2021