రైల్లో రిస్కీ స్టంట్‌: ప్రాణాలు కోల్పోయిన యువకుడు

  • Published By: veegamteam ,Published On : December 30, 2019 / 07:52 AM IST
రైల్లో రిస్కీ స్టంట్‌: ప్రాణాలు కోల్పోయిన యువకుడు

Updated On : December 30, 2019 / 7:52 AM IST

పోకిరీల చేష్టలు మితిమీరిపోతున్నాయి. కొంతమంది యువకుల సాహసాలకు హద్దు, పద్దూ లేకుండా పోతోంది. ప్రమాదం అని తెలిసినా.. రిస్కీ స్టంట్‌లు చేస్తారు. తాజాగా ఓ యువకుడు రైలులో డేంజరస్‌ ఫీట్‌ చేసి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన డిసెంబర్ 26న ముంబైలో చోటుచేసుకుంది.

వివరాలు.. కదులుతున్న రైల్ లో డోర్‌ దగ్గర నిల్చుని బయటకు వేలాడుతూ రిస్కీ స్టంట్‌ చేశాడో. ఈ స్టంట్‌ కాస్తా అదుపు తప్పి ప్లాట్‌ఫాం మీద పడి అక్కడికక్కడే చనిపోయాడు. జరిగిన విషయమంతా అతని స్నేహితులు వీడియో తీసారు. దీంతో స్వయంగా రైల్వే మంత్రిత్వ శాఖ దీనికి సబంధించిన వీడియోను ట్వీట్‌ చేసింది.

ఈ ప్రమాదంలో దిల్షాన్ అనే యువకుడు మరణించాడని తెలిపాడు. రైలులో ఇలాంటి స్టంట్స్ చేయద్దు, ఇది చట్టవిరుద్ధం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయని ప్రయాణికులను హెచ్చరించింది. భద్రతను పట్టించుకోకుండా, కదిలే రైలు ఎక్కడం, కదిలే రైలులో స్టంట్లు, వింతప్రయోగాలు లాంటివి చేయొద్దని సూచించింది.