దీపికా పదుకొణెకు మరో బాలీవుడ్‌ నటి మద్దతు

జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావం తెలిపిన విషయంలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణెకు మరో బాలీవుడ్‌ నటి మద్దతు తెలిపింది. దీపిక చేసింది సరైన పనే అని నటి సోనాక్షి సిన్హా ట్విటర్‌ వేదికగా స్పందించారు.

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 05:11 AM IST
దీపికా పదుకొణెకు మరో బాలీవుడ్‌ నటి మద్దతు

Updated On : January 9, 2020 / 5:11 AM IST

జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావం తెలిపిన విషయంలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణెకు మరో బాలీవుడ్‌ నటి మద్దతు తెలిపింది. దీపిక చేసింది సరైన పనే అని నటి సోనాక్షి సిన్హా ట్విటర్‌ వేదికగా స్పందించారు.

జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావం తెలిపిన విషయంలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణెకు మరో బాలీవుడ్‌ నటి మద్దతు తెలిపింది. దీపిక చేసింది సరైన పనే అని నటి సోనాక్షి సిన్హా ట్విటర్‌ వేదికగా స్పందించారు. జేఎన్‌యూలో విద్యార్థులకు రక్తం కారుతున్న చిత్రాలు అందరినీ కదలించాయని తెలిపింది. అందులో భాగంగానే దీపికా పదుకొణెకు జేఎన్‌యూ విద్యార్థులకు మద్దతు తెలిపారని… ఇందుకు ఆమెకు అభినందలు అంటూ ట్వీట్‌ చేశారు. దీపిక తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేసిందని ప్రశంసించింది. 

ఢిల్లీలోని JNU క్యాంపస్‌లోకి ముసుగు వ్యక్తులు చొరబడి 30 స్టూడెంట్స్‌ను గాయపరిచారు. బాధితులను కలిసేందుకు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె అక్కడికి వెళ్లారు. ఎటువంటి కామెంట్లు చేయకుండా విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. గాయాలకు గురైన ఐషే ఘోష్‌తో పాటుగా మాజీ విద్యార్థి కన్హయ్య కుమార్ కూడా అక్కడ సమావేశమయ్యారు. సాయంత్రం 7గంటల 30నిమిషాల ప్రాంతంలో దీపికా అక్కడకు వచ్చి ఓ పదిహేను నిమిషాలు విద్యార్థులను కలిసి మాట్లాడింది.

వచ్చిన కాసేపటికే బీజేపీ నుంచి దీపికా పదుకొనె సినిమాలు బాయ్‌కాట్ చేయాలంటూ ఆదేశాలు అందాయట. బాలీవుడ్ ఏ కేటగిరీలో ఉన్న పెద్ద స్టార్స్ అంతా మౌనంగా ఉన్నప్పటికీ దీపికా తీసుకున్న నిర్ణయానికి అభిమానుల నుంచి మంచి స్పందనే వస్తుంది. దీనిపై మాట్లాడిన దీపికా.. ‘నేను గర్విస్తున్నాను. ఇటువంటి దాడులు జరిగినా మనోళ్లు భయపడలేదు. మనదేశ భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నాం. వీధుల్లోకి.. బయటకు వచ్చి జనాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం మంచి విషయం. మార్పు కోరుకుంటే ఇది చాలా ముఖ్యం’ అని వెల్లడించారు. 

50 మంది గుర్తు తెలియని వ్యక్తులు రాడ్లు, కర్రలు, హాకీ స్టిక్స్ చేతబట్టుకుని ఆదివారం రాత్రి ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(JNU) క్యాంపస్ లోకి వెళ్లి విద్యార్థులు, ఫ్యాకల్టీపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.  దేశ్ కీ గద్దారో కో, గోలీ మారో సాలా కో అంటూ బిగ్గరగా నినాదాలు చేస్తూ లేడీస్ హాస్టల్స్ కి కూడా వెళ్లి విద్యార్థినులపై దుండగులు దాడిచేశారు. యావత్తు దేశం జేఎన్ యూ ఘటనను ఖండిస్తోంది. 

ఈ దాడికి పాల్పడింది ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీకి సంబంధించినవాళ్లేనన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే విద్యార్థులు, ఉపాధ్యాయులపై దుర్మార్గపు దాడి కేవలం క్యాంపస్ హింసకు సంబంధించిన కేసు కాదు. జెఎన్‌యు విద్యార్థులపై గుంపు హింస ముందే చెప్పిన చరిత్ర. ఈ దాడిని యూనివర్శిటీ, దాని సిబ్బంది, అధ్యాపకులను రోజువారీగా భూతవైద్యులుగా చూపిన ఫలితంగా చెప్పవచ్చు.