క్రిమినల్స్ కు ఎందుకు టిక్కెట్లను ఇస్తున్నారో ప్రజలకు చెప్పండి. రాజకీయ పార్టీలకు సుప్రీం ఆదేశం

  • Published By: veegamteam ,Published On : February 13, 2020 / 06:41 AM IST
క్రిమినల్స్ కు ఎందుకు టిక్కెట్లను ఇస్తున్నారో ప్రజలకు చెప్పండి. రాజకీయ పార్టీలకు సుప్రీం ఆదేశం

Updated On : February 13, 2020 / 6:41 AM IST

నేర చరిత్ర ఉన్న రాజకీయ నేతలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది.  ఈ సందర్బంగా ధర్మానం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు  సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల అభ్యర్ధుల నేర చరిత్రలను ఈసీకి సమర్పించాలని ఆ నేరా చరిత్రలను..దానికి సంబంధించిన అన్ని వివరాలను వెబ్ సైట్ లలో పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజాస్వామ్యంలో మనుగడ కొనసాగిస్తూ..ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు..ఎంపీలు..నేర చరిత్ర కలిగి ఉండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసిది. ఇటువంటి నేరస్తులు ప్రజలకు ఎటువంటి న్యాయం చేస్తారని వ్యాఖ్యానించింది. నేర చరిత్ర కలిగిన ఉన్న నేతలకు పార్టీ టిక్కెట్లు ఎందుకిస్తున్నారో చెప్పాలని ఆదేశించింది. 

వివరాల్లోకి వెళితే..నేర చరిత్ర ఉన్న రాజ‌కీయ‌వేత్త‌ల‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. అటువంటి నేత‌ల‌ను తమ పార్టీల్లో కొనసాగిస్తున్న రాజ‌కీయ పార్టీలు త‌మ వెబ్‌సైట్ల‌లో ఆ క‌ళంకిత నేత‌ల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది.  48 గంట‌ల్లోనే వారి వివ‌రాల‌ను వెబ్‌సైట్ల‌లో పెట్టాల‌ని ఇవాళ ఆదేశించింది. ఎటువంటి నేత‌ల‌పై ఎటువంటి నేరానికి సంబంధించిన కేసులు ఉన్నాయో, వారిని ఎందుకు  పార్టీలో చేర్చుకున్నారో అన్న అంశాల‌ను త‌మ త‌మ వెబ్‌సైట్ల‌లో పొందుప‌రుచాల‌ని కోర్టు త‌న తీర్పులో రాజ‌కీయ పార్టీల‌ను ఆదేశించింది. రాజ‌కీయ‌ల్లో క్రిమిన‌ల్స్ పెరుగుతున్నార‌ని కోర్టు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. జ‌స్టిస్ ఆర్ఎఫ్ నారీమ‌న్‌, ర‌వీంద్ర భ‌ట్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ ఆదేశాలను వెలువరించింది. 

అంతేకాదు..సోష‌ల్ మీడియా, స్థానిక ప‌త్రిక‌ల్లో కూడా నేర చరిత్ర క‌లిగి ఉన్న ప్ర‌జాప్ర‌తినిధుల‌ గురించి రాజ‌కీయ పార్టీలు వెల్ల‌డించాల‌ని కోర్టు సూచించింది. రానున్న 72 గంట‌ల్లో ఆ వివ‌రాల‌ను ఈసీకి తెలియ‌జేయాల‌ని ఆదేశించింది. అభ్య‌ర్థుల ఎంపిక అనేది మెరిట్ ఆధారంగా..ప్రజలకు వారు నిజంగా సేవ చేయగలుగేవారా? కాదా? అనే విషయాలను ఆయా పార్టీలు గుర్తించాలి అంతేకానీ..గెలుపు శాతం ఆధారంగా కాద‌ని కోర్టు దేశంలోని రాష్ట్రాల రాజకీయ పార్టీలకు సూచించింది.

ఒక‌వేళ రాజ‌కీయ పార్టీలు నేర చ‌రిత్ర క‌లిగిన నేత‌ల వివ‌రాలు ఇవ్వ‌లేక‌పోయినా, లేక ఎన్నిక‌ల సంఘం త‌మ ఆదేశాల‌ను అమ‌లు చేయ‌లేక‌పోయినా.. దాన్ని కోర్టు ధిక్క‌ర‌ణ‌గా భావిస్తామ‌ని సుప్రీం పేర్కొన్న‌ది. న్యాయ‌వాది అశ్విని కుమార్ ఉపాధ్యాతో పాటు ఇత‌రులు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల ఆధారంగా సుప్రీం ఈ తీర్పును ఇచ్చింది.  

ఆయా ప్ర‌జాప్ర‌తినిధి ఎటువంటి నేరానికి పాల్ప‌డ్డాడు, దానికి సంబంధించిన కేసు విచార‌ణ ఏ స్థాయిలో ఉన్న‌దన్న అంశాల‌ను కూడా వెల్ల‌డించాల‌ని కోర్టు చెప్పింది. ఒక అభ్య‌ర్థికి సీటు ఇవ్వ‌డానికి గ‌త కార‌ణాల‌ను కూడా రాజ‌కీయా పార్టీలు వెల్ల‌డించాల‌ని కోర్టు ఆదేశించింది.