రియా చక్రవర్తికి సపోర్ట్గా లక్ష్మి మంచు.. సుశాంత్ సింగ్ మేనకోడలు ఆగ్రహం

Sushant Singh Rajput’s Niece Mallika Slams Lakshmi Manchu: మంచువారి అమ్మాయి లక్ష్మి మంచుపై ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్పుత్ మేనకోడలు మల్లికా సింగ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశాంత్ బలవన్మరణం కేసులో అందరూ నటి రియా చక్రవర్తిని టార్గెట్ చేస్తుండగా.. అనూహ్యంగా మంచు లక్ష్మి రియాకు మద్దతు తెలిపారు. ఆమెకు న్యాయం జరగాలని వాదిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో #JusticeForSushantSinghRajput, #JusticeForRheaChakraborty అంటూ ఓ పోస్ట్ పెట్టారు.
“రియా చక్రవర్తిని సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ చేసిన ఇంటర్వ్యూ మొత్తం చూశాను. ఆ తర్వాత దీనిపై స్పందించాలా? వద్దా? అని చాలా ఆలోచించాను. కానీ ఇప్పటికే మీడియా ఆమెను రాక్షసిగా చిత్రీకరించింది. చాలామంది దీనిపై మౌనంగా ఉన్నా.. నాకు నిజం ఏంటో తెలీదు, కానీ నిజాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నిజం ఎలాగైనా బయటకు వస్తుందని నమ్ముతున్నాను. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, అన్ని రకాల దర్యాప్తు సంస్థలు సుశాంత్కు న్యాయం చేయడానికి పాటుపడుతున్నాయి” అని తన పోస్ట్లో మంచు లక్ష్మీ అన్నారు.
@sardesairajdeep @Tweet2Rhea @itsSSR . Wake up my industry friends… stop this lynching. #letthetruthprevail pic.twitter.com/5SCEX8Un8H
— Lakshmi Manchu (@LakshmiManchu) August 30, 2020
లక్ష్మీ ట్వీట్కు రీట్వీట్ చేయడం ద్వారా బాలీవుడ్ నటి తాప్సీ పన్నూ కూడా మద్దతు ఇచ్చారు. “నాకు వ్యక్తిగతంగా సుశాంత్ పెద్దగా పరిచయం లేదు, రియా కూడా అంతగా తెలీదు. తెలిసిందల్లా ఒక్కటే.. నేరం నిరూపణ అవకముందే ఓ వ్యక్తిని దోషిగా నిలబట్టే ప్రయత్నం చేయడం తప్పు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ విశ్వసించండి” అంటూ ట్వీట్ చేశారు తాప్సీ.
I didn’t know Sushant on a personal level nor do I know Rhea but what I know is, it only takes to be a human to understand how wrong it is to overtake judiciary to convict someone who isn’t proven guilty. Trust the law of the land for your sanity and the deceased’s sanctity ?? https://t.co/gmd6GVMNjc
— taapsee pannu (@taapsee) August 30, 2020
అయితే దీనిపై సుశాంత్ మేనకోడలు మల్లికా తన ఇన్స్టాలో స్పందించారు. ప్రస్తుతానికి నేను షాక్లో ఉన్నాను. అంతేకాదు ఆశ్చర్యంగా కూడా ఉంది. సినీ కుటుంబం, సహా నటులు అంటూ ఇప్పుడు మాట్లాడుతున్న వారు ఇంతకముందు ఏమయ్యారో అంటూ మల్లికా కాస్త ఘూటుగానే రాసుకొచ్చింది. దీనికి సుశాంత్ సోదరి శ్వేతా ఇది నిజం అని బదులిచ్చింది.
Exactly!! https://t.co/prqeUHuY9a
— shweta singh kirti (@shwetasinghkirt) August 31, 2020
ఇదిలావుండగా, సోమవారం, సిబిఐ బృందం రియాను విచారించడం కొనసాగించింది. మరొకరు సుశాంత్ ఫ్లాట్ను మరోసారి సందర్శించారు. రియాతో పాటు, అతను తన సోదరుడు షౌవిక్ చక్రవర్తి మరియు మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోడీలను ప్రశ్నించారు. ముంబైలోని డిఆర్డిఓ గెస్ట్హౌస్లో వారందరినీ సిబిఐ బృందం విచారిస్తోంది. సుశాంత్ ఫ్లాట్లో నివసిస్తున్న సిద్ధార్థ్ పిథానిని కూడా ఈ రోజు సిబిఐ పిలిచింది.
ఐఎఎన్ఎస్ నివేదిక ప్రకారం, సుశాంత్తో విడిపోవడం, నటుడు మరణించిన సమయం మరియు కూపర్ హాస్పిటల్ మోర్చారిలోకి ప్రవేశించడం గురించి సిబిఐ బృందం రియాను ప్రశ్నించింది. వాట్సాప్ చాట్లో డ్రగ్స్ ప్రస్తావనకు సంబంధించి రియాను కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. సందీప్ సింగ్, శ్రుతి మోడీ గురించి కూడా రియాను ప్రశ్నించారు. రియా ప్రకారం 3 రోజుల్లో 25 గంటలకు పైగా ప్రశ్నించారు.