Mumbai : టోల్ ప్లాజా వద్ద కారు బీభత్సం…ముగ్గురి మృతి, ఆరుగురికి గాయాలు

ముంబయిలో వేగంగా వెళుతున్న ఓ కారు బీభత్సం సృష్టించింది. ముంబయిలోని వర్లీ నుంచి ఉత్తర దిశగా బాంద్రా వైపు వెళుతున్న ఒక కారు టోల్ ప్లాజా వద్ద పార్క్ చేసిన పలు కార్లను ఢీకొట్టింది....

Mumbai : టోల్ ప్లాజా వద్ద కారు బీభత్సం…ముగ్గురి మృతి, ఆరుగురికి గాయాలు

car hits

Mumbai : ముంబయిలో వేగంగా వెళుతున్న ఓ కారు గురువారం రాత్రి బీభత్సం సృష్టించింది. ముంబయిలోని వర్లీ నుంచి ఉత్తర దిశగా బాంద్రా వైపు వెళుతున్న ఒక కారు టోల్ ప్లాజా వద్ద పార్క్ చేసిన పలు కార్లను ఢీకొట్టింది. ముంబయి నగరంలోని టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న పలు వాహనాలను అతివేగంగా నడుపుతున్న కారు ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. గురువారం రాత్రి కారు వర్లీ నుంచి ఉత్తర దిశగా బాంద్రా వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ముంబయి పోలీసులు తెలిపారు.

Also Read : Congress Final List : కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ విడుదల.. అద్దంకి దయాకర్‌కు హ్యాండ్, నీలం మధుకు షాక్

సీ లింక్‌లో టోల్ ప్లాజాకు 100 మీటర్ల ముందు ఇన్నోవా కారు మొదట మెర్సిడెస్ కారును ఢీకొట్టింది. ఆ తర్వాత మరో రెండు మూడు వాహనాలను ఢీకొట్టిందని డీసీపీ కృష్ణకాంత్ ఉపాధ్యాయ తెలిపారు. ముంబయిలో వేగంగా వెళుతున్న కారు పలు వాహనాలను ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. మెర్సిడెస్, ఇన్నోవా సహా ఆరు కార్లు ప్రమాదానికి గురయ్యాయని పోలీసు అధికారి తెలిపారు.

Also Read : Teenmar Mallanna : తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ కీలక పదవి

గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి నిలకడగా ఉందని, మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరు లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మిగిలిన ఐదుగురు భాభా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఇన్నోవా కారు డ్రైవర్ కూడా ఉన్నట్లు పోలీసులు వివరించారు.