ఎనిమిదేళ్ల బాలికను ఆడుకుందామని పిలిచి ఏడుగురు టీనేజర్ల రేప్

ఎనిమిదేళ్ల బాలికను ఆడుకుందామని పిలిచి ఏడుగురు టీనేజర్ల రేప్

Updated On : August 31, 2020 / 10:50 AM IST

ఆడుకుందామని ఇంటికి పిలిచి ఎనిమిదేళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ కు తెగబడ్డారు ఏడుగురు టీనేజర్లు. త్రిపుర గ్రామంలో దాగుడుమూతలు ఆట ఆడుకుందామని చెప్పి బాలికను పిలిచారు. పశ్చిమ త్రిపుర జిల్లాలో ఉండే వారిలో ఆరుగురిని అరెస్టు చేయగా ఇంకొక వ్యక్తి పరారీలో ఉన్నారు.



నలుగురిని ఆల్రెడీ జువైనల్ హోంకు పంపించారు. మిగిలిన ఇద్దరు 12ఏళ్లకు దగ్గర్లో ఉన్నవారిని పరీక్షించడంతో వారికి కరోనా పాజిటివ్ గా తేలింది. ‘బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశాం. హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుకుందామని బాలికను పిలిచారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది’ అని సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ప్రియా మాధురీ మజుందార్ అన్నారు.
https://10tv.in/man-held-for-using-fake-certificates-to-get-government-job/
మూడో తరగతి చదువుతున్న బాలిక ఘటన జరిగిన తర్వాత ఇంటికి వచ్చి పేరెంట్స్ కు చెప్పుకుంది. వారంతా తెలిసిన కుటుంబాల వారే కావడంతో బాలిక నమ్మి వెళ్లిందని చెప్తున్నారు. మొత్తం ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వారిలో ఆరుగురిపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఒకరు పరారీలో ఉన్నారు.