Ammu Abhirami : ‘రాజాసాబ్’ లో ముగ్గురు హీరోయిన్స్.. ఫ్లాష్ బ్యాక్ లో మరో హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా..?
'రాజాసాబ్' సినిమాలో ఇంకో హీరోయిన్ కూడా ఉంది.

ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్న సంగతి తెలిసిందే. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ ముగ్గురు సినిమాలో, బయట ప్రమోషన్స్ లో సందడి చేసారు.

అయితే ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ కూడా ఉంది. ప్రభాస్ నానమ్మ పాత్రలో బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ జరీనా వాహబ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంది.

ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ప్రభాస్ నానమ్మ యంగ్ పాత్రలో నటి అమ్ము అభిరామి నటించింది.

ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించకుండా తమిళ భామ అమ్ము అభిరామి ఆ పాత్రలో సడెన్ గా కనిపించడంతో ప్రేక్షకులు, ఆమె అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అమ్ము అభిరామికి రాజాసాబ్ సినిమాలో మంచి పాత్రే పడింది. ఆమెకు చాలా సీన్స్ ఉన్నాయి. సంజయ్ దత్, సముద్రఖని కాంబోలో సీన్స్ ఉన్నాయి.

తమిళ భామ అమ్ము అభిరామి తమిళ్, తెలుగులో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది.

తెలుగులో రాక్షసుడు, నారప్ప, ఫాదర్ చిట్టి ఉమ కార్తీక్, రణస్థలి, డెవిల్.. సినిమాల్లో కనిపించి మెప్పించింది.

ఇప్పుడు ఇలా సడెన్ గా అమ్ము అభిరామి రాజాసాబ్ సినిమాలో యువరాణి పాత్రలో, ప్రభాస్ నానమ్మ యంగ్ వర్షన్ లో కనిపించి అలరించింది.

దీంతో రాజాసాబ్ సినిమాలో ఇంకో హీరోయిన్ ఉందంటూ అమ్ము అభిరామి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


'రాజాసాబ్' లో ముగ్గురు హీరోయిన్స్.. ఫ్లాష్ బ్యాక్ లో మరో హీరోయిన్..


అమ్ము అభిరామి


