AP Alliance Talks : ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్.. రేపే ఎన్డీయేలో టీడీపీ చేరిక? పొత్తులపై తుది నిర్ణయం..!

హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు.

AP Alliance Talks : ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్.. రేపే ఎన్డీయేలో టీడీపీ చేరిక? పొత్తులపై తుది నిర్ణయం..!

AP Alliance Talks

AP Alliance Talks : పొత్తుల విషయంపై చర్చించేందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పొత్తుల గురించి బీజేపీ హైకమాండ్ తో ఇద్దరు నేతలు చర్చించనున్నారని సమాచారం. అటు రేపు ఎన్డీయేలో టీడీపీ చేరనున్నట్లు తెలుస్తోంది. పొత్తుల విషయంపై రాష్ట్ర నాయకులతో బీజేపీ ఇప్పటికే చర్చించింది. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం. రేపు ఎన్డీయే పక్షాల సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలోనే టీడీపీ లాంఛనంగా ఎన్డీయేలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ రేపు ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా గ్యాప్ పెట్టుకున్నారు. ఇద్దరూ మాట్లాడుకుని ఢిల్లీ వెళ్లే చాన్స్ ఉంది. బీజేపీ పెద్దలతో సమావేశం అవుతారు. ఇప్పటికే ఫిబ్రవరి 7న చంద్రబాబు.. అమిత్ షాను కలిశారు. అప్పటి నుంచి కూడా బీజేపీ హైకమాండ్ పిలుపు కోసం చంద్రబాబు, పవన్ వెయిట్ చేస్తున్నారు. చాలా కాలంగా పవన్ కల్యాణ్ కూడా హైదరాబాద్ లో ఎదురుచూశారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి పవన్ కల్యాణ్ కు సమాచారం వచ్చిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

చంద్రబాబుకి సమాచారం వచ్చిందో లేదో ధృవీకరించడం లేదు. ఇప్పటికే టీడీపీ 99మందితో తొలి జాబితా విడుదల చేసింది. పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వాల్సిన సీట్లు ఉంటాయి కనుక.. రెండో జాబితాను రిలీజ్ చేయకుండా ఆపిన పరిస్థితి ఉంది. పొత్తులకు సంబంధించి ఢిల్లీలో రేపు కీలక చర్చలు జరగబోతున్నాయి. పొత్తుల అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read : వైసీపీ వర్సెస్ టీడీపీ.. నెల్లూరులో జోరుమీదున్న పార్టీ ఏది?