Kamandala Ganapathi Temple : కమండల గణపతి దేవాలయం.. స్వామి పాదాలవద్ద పొంగిపొర్లే పవిత్ర గంగాజలం విశిష్టత
అది వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఓ అద్భుత దేవాయలం. యోగ ముద్రతో దర్శనమిచ్చే స్వామి. ఆ స్వామి పాదాల చెంత పొంగిపొర్లే పవిత్ర గంగాజలం. ఈ నీటిని సేవిస్తే సకల రోగాలు మటుమాయం అవుతాయట..
Kamandala Ganapathi Temple In Karnataka : భారతదేశంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు..మరెన్నో అత్యద్భుతమైన దేవాలయాల నిర్మాణాలు ఈనాటికి మిస్టరీగా ఉన్నాయి. ఈ మిస్టరీలను ఛేదించేందుకు ఎంతోమంది పరిశోధనలు చేసినా వీడలేదు. అవి కేవలం రహస్యాలు కాదు మానవాతీత ఆధ్యాత్మిక శక్తులు అని భగవంతుడి లీలలు అని భక్తుల నమ్మకం. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన అటువంటి ఓ అద్భుత దేవాయలం గురించి తెలుసుకుందాం..
అది కర్ణాటకలోని చిక్క మంగళూరు జిల్లా కొప్ప పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి దట్టమైన అటవీ ప్రాంతం. పచ్చని ప్రకృతికి పుట్టినిల్లుగా ఉండే ఆ ప్రదేశంలో గణపయ్య ఆలయం ప్రసిద్ధి చెందింది. గణపయ్యకు ఎన్నో పేర్లున్నా ఈ దేవాలయంలో మాత్రం ‘కమండల గణపతి’ పేరుతో పూజలందుకుంటున్నాడు. గణపతి, వినాయకుడు,గణనాధుడు అనే ఎన్నో పేర్లు కలిగిన విఘ్నేశ్వరుడు ‘కమండల గణపతి’గా వెలిసిన ఈ దేవాలయానికి విశిష్టమైన చరిత్ర ఉంది. ఈ స్వామి పాదాల వద్ద గంగాజలం పొంగిపొర్లుతుంటుంది. కమండలం గణపతి పాదాల వద్ద పొంగిపొర్లే ఈ పవిత్రమైన గంగాజలం సాక్షాత్తు బ్రహ్మదేవుడు కమండలం నుంచి పోశాడని చెబుతారు. అందుకే ఈ నీటినుంచి ప్రవహించిన నీరు బ్రాహ్మి నది (Brāhmi River)గా మారిందని చెబుతారు.
ఈ దేవాయలం స్థల పురాణం విషయానికి వస్తే..శనిదేవుడు వక్ర దృష్టి పడితే సాక్షాత్తు దేవతలే కాదు..ఆ పార్వతీదేవే కష్టాలు పడిందని పురాణాలు చెబుతున్నాయి. అలా శని వక్రదృష్టి పడిన పార్వతీదేవి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నదటం ఆ ఆదిపరాశక్తి. అలా శనిదేవుని ప్రభావంతో పార్వతీదేవి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేయటానికి వచ్చిందట. అలా వచ్చిన ఆ జగన్మాత విఘ్నాలు తొలగించే వినాయకుడిని ప్రార్థించిందట. అమ్మ పార్వతీదేవి కోరిక మేరకు వినాయకుడు ప్రత్యక్షమయ్యాడట. బ్రహ్మచారి రూపంలో కమండలం ధరించి..ప్రత్యక్షమయ్యాడట. అలా ప్రత్యక్షమైన వినాయకుడు సృష్టించిన తీర్థాన్ని బ్రహ్మ తీర్థం అని చెబుతారు.ఈ విధంగా వినాయకుడు కమండలం ధరించి ఉండటంవల్ల ఈ ఆలయానికి కమండల గణపతి అనే పేరు వచ్చింది.
ఈ ఆలయంలో పూజలందుకుంటున్న గణపయ్య యోగ ముద్రలో కూర్చుని భక్తులకు దర్శనమిస్తాడు. వర్షాకాలంలో పుష్కరిణిలో ఉండే నీరు స్వామివారి పాదాలకు తాకుతుంది.ఈ సమయంలో స్వామివారిని దర్శించి ఆ నీటిని మహా తీర్థ ప్రసాదంగా తీసుకుంటారు భక్తులు. ఈ నీటిని సేవిస్తే సకల రోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. పుష్కరిణిలోని నీరు వినాయకుడి పాదాలను తాకడం వల్ల ఇక్కడ వెలసిన స్వామివారిని కమండల గణపతి అని కూడా పిలుస్తారు.
ఈ స్వామివారి ఆలయంలో పూజలు మధ్యాహ్నం వరకే నిర్వహిస్తారు కనుక స్వామివారిని దర్శించుకోవాలంటే తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ కమండలం గణపతి పాదాల నుంచి పొంగిపొర్లే ఈ నీరు బ్రాహ్మీ నదికి మూలమని చెబుతారు. పురాణాల ప్రకారం ఈ నీటిని బ్రహ్మదేవుడు తన కమండలం నుంచి పోశాడని చెబుతారు. మరి గణపయ్య పాదాల వద్ద పొంగిపొర్లే గంగాజలాన్ని ఈ వీడియోలో చూసి తరించండి..
Mystical Kamandala Ganapati Temple !!
The constantly flowing water in front of the idol of Lord Ganesha is the origin of Brāhmi River.
The holy water is believed to be poured by Lord Brahmā Ji from his Kamandala.
At Koppa, Chikmagalur Dist. Karnataka.
Sri Ganeshaya Namah 🌺🙏 pic.twitter.com/fReUEXuLat
— 💪🎭..Rai ji..💪🎭 (@Vinod_r108) December 22, 2023