Bhavani Deekshalu : ఇంద్రకీలాద్రిపై నేడు,రేపు ప్రోటోకాల్ దర్సనాలు రద్దు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు  నిన్నటితో వైభవంగా ముగిసాయి.

  • Updated on- October 16, 2021 / 07:56 AM IST

Bhavani Devotees

Bhavani Deekshalu  : . నేడు కూడా రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు భారీగా తరలి వస్తున్నారు.

భవానీ భక్తులతో క్యూలైన్లు రద్దీగామారాయి. భవానీల రద్దీతో ఈరోజు రేపు ప్రోటోకాల్ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. ఈరోజు రేపు సాధారణ దర్శనాలు మాత్రమే అనుమతిస్తారు, భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి ఎటువంటి వాహనాలకు అనుమతించటంలేదని కలెక్టర్ తెలిపారు.