Tirumala : మే 26న వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన టోకెన్ల కోటా విడుదల
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి కోసం మే 26 న టీటీడీ ప్రత్యేక దర్శనం కోటా టికెట్లు విడుదల చేయనుంది.

Tirumala
Tirumala : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి కోసం మే 26 న టీటీడీ ప్రత్యేక దర్శనం కోటా టికెట్లు విడుదల చేయనుంది. జూన్ నెలలో వీరు దర్శనం చేసుకోటానికి వీలుగా మే 26వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో టికెట్లు విడుదల చేస్తారు.
కాగా,ఈ విధంగా బుక్ చేసుకున్న వారిని ప్రస్తుతం ప్రతిరోజూ ఉదయం 10 గంటల స్లాట్లో దర్శనానికి అనుమతిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుండి ఉదయం 10 గంటలకు బదులుగా మధ్యాహ్నం 3 గంటల స్లాట్లో వయో వృధ్ధులను, దివ్యాంగులను అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది. కాగా, ఆగస్టు నెలకు సంబంధించిన గదుల కోటా మే 26వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల కానుంది.