Tokyo Olympics 2020 : ముగిసిన భారత ఆర్చరీ టీమ్ పోరాటం.. క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమి.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆర్చరీ టీమ్ పోరాటం ముగిసింది. మెన్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ఆర్చర్లు అథాను దాస్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్... కొరియా ఆర్చర్ టీమ్ చేతుల్లో 6-0 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్కమించారు.

Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆర్చరీ టీమ్ పోరాటం ముగిసింది. మెన్స్ విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ఆర్చరీ జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. జట్టులోని అథాను దాస్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ లు ఒలంపిక్ స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయారు. దీంతో కొరియా ఆర్చర్ టీమ్ చేతుల్లో 6-0 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్కమించారు.

మొదటి సెట్ నుంచే కొరియా ఆర్చర్లు ఆధిపత్యం కనబరిచారు. మొదటి సెట్ లో 59 పాయింట్లు సాధించారు. మొదటి సెట్ లో భారత ఆర్చరీ టీమ్ 54 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది. మొదటి సెట్ నుంచి ఆరో సెట్‌ వరకూ ఏ దశలోనూ కొరియా టీమ్‌కి పోటీ ఇవ్వలేకపోయిన భారత ఆర్చరీ జట్టు

ఒలింపిక్స్ కి ముందు జరిగిన ప్రపంచకప్ ఆర్చరీలో అద్భుత ఫలితాలు సాధించింది భారత జట్టు.. ఒలింపిక్స్ కి వచ్చేసరికి ఆ స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయింది. బలమైన కొరియా జట్టును ఎదురుకోవడంలో విఫలమై ఇంటిదారి పట్టింది.

వరల్డ్ నెం.1 ఆర్చర్ దీపికా కుమారితో పాటు అథాను దాస్, అభిషేక్ వర్మ, ప్రవీణ్ జాదవ్ అందరూ ఫెయిల్ అయ్యారు. ఆర్చరీ వరల్డ్‌కప్‌లో 7 స్వర్ణాలు సాధించిన భారత ఆర్చరీ టీమ్, టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం పతకానికి దగ్గరగా కూడా చేరుకోలేకపోయారు.

ట్రెండింగ్ వార్తలు