Asian Games: స్కేటింగ్‌లో భారత్‌కు రెండు కాంస్య పతకాలు

ఆసియా స్కేటింగ్ క్రీడల్లో భారత జట్టుకు రెండు కాంస్య పతకాలు లభించాయి. సోమవారం హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో 9వ రోజున భారత్ రోలర్ స్కేటింగ్ కాంస్యాన్ని గెలుచుకుంది. ...

Asian Games: స్కేటింగ్‌లో భారత్‌కు రెండు కాంస్య పతకాలు

skating womens team

Updated On : October 2, 2023 / 9:02 AM IST

Asian Games: ఆసియా స్కేటింగ్ క్రీడల్లో భారత జట్టుకు రెండు కాంస్య పతకాలు లభించాయి. సోమవారం హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో 9వ రోజున భారత్ రోలర్ స్కేటింగ్ కాంస్యాన్ని గెలుచుకుంది. మహిళల స్పీడ్ స్కేటింగ్ 3000 మీటర్ల రిలే టీమ్ ఈవెంట్‌లో సంజన బతుక, కార్తీక జగదీశ్వరన్, హీరల్ సాధు,ఆరత్జు కస్తూరిలతో కూడిన భారత జట్టు మూడో స్థానంలో నిలిచింది. (skating 3000 m relay)

Mexico : మెక్సికోలో కూలిన చర్చ్ పైకప్పు…ఏడుగురి మృతి

8వ రోజు అథ్లెటిక్స్‌లో పతకాల సందడితో ముగిసింది. (womens teams capture bronze medal) ఆ ఒక్కరోజే భారత బృందం మూడు స్వర్ణాలతో సహా మొత్తం 13 పతకాలు సాధించింది. మహిళల డబుల్స్ టేబుల్ టెన్నిస్ జోడీ సుతీర్థ ముఖర్జీ, అయ్హికా ముఖర్జీ ఫైనల్‌కు అర్హత సాధించడం ద్వారా రజత పతకాన్ని ఖాయం చేసింది. పురుషుల 3000 మీటర్ల రిలే ఫైనల్‌లో భారత్ 4:10:128 టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచింది. భారత జట్టులో ఆర్యన్‌పాల్ ఘుమాన్, ఆనంద్‌కుమార్ వెల్‌కుమార్, సిద్ధాంత్ కాంబ్లే, విక్రమ్ ఇంగాలే ఉన్నారు.