Punjab Kings : గెలుపు జోష్లో ఉన్న పంజాబ్కు భారీ ఎదురుదెబ్బ.. స్వదేశానికి పయనమైన స్టార్ ఆల్రౌండర్..
గెలుపు జోష్లో ఉన్న పంజాబ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Punjab Kings All Rounder Sikandar Raza : టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 262 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. గెలుపు జోష్లో ఉన్న పంజాబ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్, జింబాబ్వే ఆటగాడు సికిందర్ మిగిలిన మ్యాచ్లకు దూరం అయ్యాడు.
మే 3 నుంచి 12 వరకు బంగ్లాదేశ్ జట్టుతో జింబాబ్వే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. జింబాబ్వే జట్టుకు సికిందర్ రజా నాయకత్వం వహించనున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ను వీడాలని సికిందర్ రజా భావించాడు. ఈ క్రమంలోనే అతడు స్వదేశానికి పయనం అయ్యాడు. దీంతో అతడు ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఆడే మిగిలిన మ్యాచ్లను అందుబాటులో ఉండడం లేదు. ప్లే ఆఫ్స్కు చేరుకోవాలంటే మిగిలిన అన్ని మ్యాచుల్లో పంజాబ్ విజయం సాధించాల్సిన నేపథ్యంలో రజా జట్టును వీడడం ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
కాగా.. ఈ సీజన్లో పంజాబ్ తరుపున అతడు కేవలం రెండు మ్యాచులు మాత్రమే ఆడాడు. 43 పరుగులు చేశాడు. అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. గత ఐపీఎల్ సీజన్లో ఏడు మ్యాచుల్లో 139 పరుగులతో పాటు మూడు వికెట్లు తీశాడు. ఇందులో ఓ అర్ధశతకం ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడింది. మూడు మ్యాచుల్లోనే గెలిచింది. 6 పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఇక పంజాబ్ తన తదుపరి మ్యాచ్ను మే 1న చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో ఆడనుంది.
KKR vs PBKS : శ్రేయస్ అయ్యర్ ఔట్ కాగానే షారుఖ్ ఖాన్ చిన్న కొడుకు అబ్రామ్ ఖాన్ ఏం చేశాడో చూడండి
Thank you India 🇮🇳, @IPL and @PunjabKingsIPL for having me , loved every minute of it
Time for national 🇿🇼 duty now #InshaAllah we will meet again soon #visitzimbabwe #visitindia #Alhamdulillah pic.twitter.com/YVkBOtp6bH
— Sikandar Raza (@SRazaB24) April 27, 2024