BCCI సెక్రటరీకి COA షోకాజ్ నోటీసు

భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)సెక్రటరీ అమితాబ్ చౌదరికి ఇవాళ(సెప్టెంబర్-8,2019) కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (CAO)షోకాజ్ నోటీసు జారీ చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) & ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) సమావేశాలకు అందుబాటులో లేకపోవడంపై అమితాబ్ చౌదరికి కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (CAO) షో కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ రోజు నుంచి ఏడు రోజుల్లోగా తనపై ఎందుకు చర్య తీసుకోకూడదో అమితాబ్ వివరణ ఇవ్వాలని కోరింది.
ICC,ACC సమావేశాలకు హాజరు కాకపోవడం మాత్రమే కాకుండా బిసిసిఐని అంధకారంలో పెట్టారని ముగ్గురు సభ్యుల సీవోఏ అమితాబ్ కు పంపిన నోటీసులో తెలిపింది. ఐసిసి సమావేశం జూలై 14-20 నుండి లండన్లో జరిగింది, ఎసిసి వార్షిక సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 3 న బ్యాంకాక్లో జరిగింది. కార్యదర్శిగా జాతీయ ఎంపిక కమిటీ సమావేశాలను ఏర్పాటు చేయకుండా CoA ఇటీవల అమితాబ్ పై నిషేధం విధించినప్పటికీ, ICC,ACCలలో బిసిసిఐ ప్రతినిధిగా అమితాబ్ కొనసాగుతున్నారు.
BCCI acting Secretary Amitabh Choudhary has been asked to explain within a period of 7 days from today why action should not be taken against him. https://t.co/PGZtDPFrOj
— ANI (@ANI) September 8, 2019