సొంతగడ్డపైనే కోల్కతా నైట్ రైడర్స్ చెన్నై చేతిలో చిత్తుగా ఓడిపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా తమ టార్గెట్ ను కాపాడుకోలేక 5వికెట్ల తేడాతో చెన్నై ముందు పరాభవానికి గురైంది. ఈ సీజన్లో చెన్నై చేతిలో కోల్కతా ఓడిపోవడం ఇధి రెండోసారి.
చేధనలో చెన్నై మరోసారి పైచేయిసాధించింది. చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో 7వికెట్ల తేడాతో గెలిచిన చెన్నై.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా 5వికెట్ల తేడాతో దూసుకెళ్లింది. మరోసారి చెన్నై జట్టును సురేశ్ రైనా(58; 42బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సు)తో గెలిపించాడు. ఓపెనర్లు షేన్ వాట్సన్(6), డుప్లెసిస్(24)విఫలమైనప్పటికీ మూడో వికెట్ గా దిగిన రైనా క్రీజులో పాతుకుపోయి చివరి వరకూ నాటౌట్ గా నిలిచాడు.
అంబటిరాయుడు 11 బంతులాడి 5పరుగులతో నిరాశపర్చగా, కేదర్ జాదవ్(20), మహేంద్ర సింగ్ ధోనీ(16), రవీంద్ర జడేజా(31; 17 బంతుల్లో 5ఫోర్లు)తో 162పరుగులు చేయగలిగారు. కోల్కతా బౌలర్లలో హ్యారీ గర్నీ(1), సునీల్ నరైన్(2), పీయూశ్ చావ్లా(2)వికెట్లు పడగొట్టారు.
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా.. చెన్నై సూపర్ కింగ్స్కు 162 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. కొద్దిపాటి విరామం తర్వాత జట్టులోకి చేరిన ఓపెనర్ క్రిస్ లిన్(82; 51 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సులు)తో మొత్తం స్కోరులో సగానికి పైగా బాదేశాడు.
మిగిలిన బ్యాట్స్మెన్ అంత స్కోరు నమోదు చేయలేకపోయినా.. క్రిస్ లిన్కు తోడ్పాటును అందిస్తూ ముందుకు నడిచారు. ఈ క్రమంలో సునీల్ నరైన్(2), నితీశ్ రానా(21), రాబిన్ ఊతప్ప(0), దినేశ్ కార్తీక్(18), ఆండ్రీ రస్సెల్(10), శుభ్మాన్ గిల్(15), పీయూశ్ చావ్లా(4), కుల్దీప్ యాదవ్(0) పరుగులతో సరిపెట్టుకున్నారు.
చెన్నై బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ ఒక్కడే 4వికెట్లు పడగొట్టగా, శార్దూల్ ఠాకూర్(2), మిచెల్ శాంతర్(1) దక్కించుకున్నారు.