ENG vs IND : యశస్వి జైస్వాల్ సెంచరీ.. అరుదైన జాబితాలో చోటు
ఇంగ్లాండ్ గడ్డపై యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు.

ఇంగ్లాండ్ గడ్డపై యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో శతకంతో దుమ్ములేపాడు. కేవలం 144 బంతుల్లో మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. ఇందులో 16 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. టెస్టుల్లో యశస్వి జైస్వాల్ కు ఇది ఐదో సెంచరీ.
Sai Sudharsan : అరె ఏంట్రా ఇదీ.. అరంగ్రేటం మ్యాచ్లో సాయి సుదర్శన్ డకౌట్..
💯 for Yashasvi Jaiswal! 👏 👏
5th hundred in Test cricket! 👍 👍
This has been a fine knock in the series opener! 🙌 🙌
Updates ▶️ https://t.co/CuzAEnAMIW#TeamIndia | #ENGvIND | @ybj_19 pic.twitter.com/pGmPoFYik6
— BCCI (@BCCI) June 20, 2025
ఇక జైశ్వాల్ తన కెరీర్లో ఇంగ్లాండ్ గడ్డపై ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్లోనే సెంచరీ సాధించడం విశేషం. తద్వారా ఈ ఫీట్ సాధించిన ఐదో భారత ఆటగాడిగా జైశ్వాల్ నిలిచాడు.
ఇంగ్లాండ్లో ఆడిన తొలి మ్యాచ్లోనే సెంచరీ చేసిన భారత ఆటగాళ్లు వీరే..
మురళీ విజయ్ – 146 రన్స్ – 2014లో ట్రెంట్ బ్రిడ్జ్లో
విజయ్ మంజ్రేకర్ – 133 రన్స్ -1952లో హెడింగ్లీలో
సౌరవ్ గంగూలీ – 131 రన్స్ – 1996లో లార్డ్స్లో
సందీప్ పాటిల్ -129 * రన్స్ – 1982 ఓల్డ్ ట్రాఫోర్డ్లో
యశస్వి జైస్వాల్ – 101 రన్స్ – 2025 హెడింగ్లీలో