IND vs AUS : ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. పట్టుబిగించిన భారత్.. శతకానికి చేరువలో యశస్వి జైస్వాల్.. లీడ్ 218 రన్స్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత్ పట్టు బిగించింది.

IND vs AUS Day 2 stumps India lead by 218 runs in perth test
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ ఇండియా 57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (62), యశస్వి జైస్వాల్ (90) లు ఉన్నారు. ప్రస్తుతం భారత్ 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
తొలి ఇన్నింగ్స్లో విఫలమైన ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండో ఇన్నింగ్స్లో అదరగొట్టాడు. ఆచితూచి ఆడాడు. మంచి బంతులను గౌరవిస్తూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. ఈ క్రమంలో 123 బంతుల్లో అర్థశతకాన్ని అందుకున్నాడు. యశస్వి టెస్టు కెరీర్లో హాఫ్ సెంచరీ మార్క్ చేరుకోవడానికి అతడు తీసుకున్న అత్యధిక బంతులు ఇవే కావడం గమనార్హం.
మరో వైపు తొలి ఇన్నింగ్స్లో చూపించిన పోరాట స్పూర్తినే రాహుల్ కొనసాగించాడు. తొలి ఇన్నింగ్స్లో వివాదాస్పద నిర్ణయంతో పెవిలియన్కు చేరుకున్న రాహుల్ రెండో ఇన్నింగ్స్లో చక్కగా బ్యాటింగ్ చేశాడు. రాహుల్ 124 బంతుల్లో అర్థశతకాన్ని అందుకున్నాడు. వీరిద్దరు ఆసీస్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ చేశారు. ఒక్క వికెట్ కోల్పోకుండా రెండో రోజును ముగించారు.
అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 104 పరుగులకే ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు స్కోరు 67/7 తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ను ఆరంభించిన ఆసీస్ మరో 37 పరుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ కు 46 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
That’s Stumps on Day 2 of the first #AUSvIND Test!
A mighty batting performance from #TeamIndia! 💪 💪
9⃣0⃣* for Yashasvi Jaiswal
6⃣2⃣* for KL RahulWe will be back tomorrow for Day 3 action! ⌛️
Scorecard ▶️ https://t.co/gTqS3UPruo pic.twitter.com/JA2APCmCjx
— BCCI (@BCCI) November 23, 2024