ప్రపంచకప్-2020 కి భారత జట్టు ఇదే: ప్రకటించిన బీసీసీఐ

సౌత్ ఆఫ్రికాలో ప్రపంచ కప్ ఆడేందుకు సిద్ధం అవుతుంది భారత యువ జట్టు. అండర్- 19 ప్రపంచకప్లో ఆడబోయే జట్టును ఇవాళ(02 డిసెంబర్ 2019) ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). జనవరి 17వ తేదీ నుంచి అవుతున్న ఈ మెగా టోర్నీలో ప్రియం గార్గ్ (ఉత్తరప్రదేశ్)నేతృత్వంలోని భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఈ మేరకు సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
గ్రూప్- ఏలో భారత్తో పాటుగా జపాన్, న్యూజిలాండ్, శ్రీలంక క్రికెట్ జట్లు ప్రత్యర్థి జట్లతో తలపడనున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీన పోచెఫ్స్ట్రూంలో ప్రపంచకప్- 2020 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. అండర్-19 విభాగంలో టీమిండియా ఇప్పటికే నాలుగుసార్లు ప్రపంచకప్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ఐదవసారి ప్రపంచకప్ కొట్టాలని ఉవ్విళ్లూరుతుంది భారత్.
ప్రపంచకప్-2020 అండర్-19 భారత జట్టు:
ప్రియం గార్గ్(కెప్టెన్), ధ్రువ్ జరేల్(వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, దివ్యాంశ్ సక్సేనా, శశ్వత్ రావత్, దివ్యాంగ్ జోషి, శుభాంగ్ హెగ్డే, రవి బిష్ణోయి, ఆకాశ్ సింగ్, కార్తిక్ త్యాగి, అథర్వ అంకోలేకర్, కుమార్ కుషాగ్ర(వికెట్ కీపర్), సుశాంత్ మిశ్రా, విద్యాధర్ పాటిల్
Four-time winner India announce U19 Cricket World Cup squad. Priyam Garg to lead the side. pic.twitter.com/VEIPxe2a2n
— BCCI (@BCCI) December 2, 2019