Suresh Raina : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇంట్లో తీవ్ర విషాదం..
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇంట వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
Raina : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇంట వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నాలుగేళ్ల క్రితం 2020 ఐపీఎల్ సీజన్ ఆరంభంలో అతడి మేనమామ ఇంట్లోకి చొరబడిన దోపిడి దొంగలు.. ఇంట్లోని వారిని అతి కిరాతకంగా చంపేశారు. ఈ ఘటన నుంచి ఇంకా రైనా తేరుకోకముందే మరో విషాదం చోటు చేసుకుంది. మరో మేనమామ కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా జిల్లా పఠాన్కోట్-మండియా జాతీయ రహదారిపై సౌరభ్ కుమార్ (రైనా మామ కొడుకు) బైక్ పై వెలుతున్నాడు. వెనుక నుంచి వచ్చిన ట్యాక్సీ వాహనం బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 29 ఏళ్ల సౌరభ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడితో పాటు మరో వ్యక్తి సైతం మరణించాడు. సౌరవ్ స్నేహితుడు కుత్మాన్కు చెందిన శుభమ్ (19) సైతం ఘటనాస్థలంలోనే చనిపోయాడు.
Rohit Sharma : హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో ఆడడంపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ
ప్రమాదం జరగగానే ట్యాక్సీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహలను పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజ్ ఆధారంగా ప్రమాదానికి కారణమైన ట్యాక్సీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.