Womens Champions Trophy : భారత్ వేదికగానే తొలి ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ.. ప్రారంభ తేదీ, వేదికలు ఖరారు
మొట్ట మొదటి ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి (Womens Champions Trophy) భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
The inaugural edition of the Womens Champions Trophy will be played in India
Womens Champions Trophy : మొట్ట మొదటి ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఐసీసీ వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఆరు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయని తెలిపింది. ఈ టోర్నమెంట్ తొలి ఎడిషన్లోని అన్ని మ్యాచ్లు ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, వడోదరలోని వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి.
వాస్తవానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉంది. శ్రీలంక క్రికెట్ బోర్డు పరిపాలన వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్న కారణంగా ఐసీసీ ఆతిథ్య హక్కుల నుంచి శ్రీలంకను తప్పించింది.
A new chapter in women’s cricket is waiting to be written 🤩
The dates and venues for the inaugural Women’s Champions Trophy in 2027 are locked in 🔒https://t.co/QrY2iyDwyU
— ICC (@ICC) September 2, 2026
ఇక ఈ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇవ్వడానికి బంగ్లాదేశ్, భారత్, దక్షిణాఫ్రికా అభ్యర్థులను ఐసీసీ తన నిర్ధారిత ఆతిథ్య మూల్యాంకన ప్రమాణాల ప్రకారం అంచనా వేసి, ప్రత్యామ్నాయ ఆతిథ్య దేశంగా భారత్ను సిఫార్సు చేసింది. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 1న ఐసీసీ బోర్డు ఆమోదించింది.
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 మహిళల క్రికెట్కు ఒక ఉత్తేజకరమైన కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది అని ఐసిసి ఛైర్మన్ జై షా అన్నారు.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొననున్నాయి. టీ20 ఫార్మాట్లో ఈ మెగాటోర్నీని నిర్వహించనున్నారు. ఈ ఆరు జట్లు రౌండ్-రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీ పడనున్నాయి. అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్లో తలపడనున్నాయి.
