BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు పండుగే.. రూ. 345 రీఛార్జ్ ప్లాన్‌తో 60 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!

BSNL Recharge Plan : ఈ బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 60 రోజుల పాటు, ఫ్రీ కాలింగ్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లతో పాటు సుదీర్ఘమైన వ్యాలిడిటీని అందిస్తుంది. దాంతో పాటు, వినియోగదారులు 1జీబీ రోజువారీ డేటాను పొందవచ్చు.

BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు పండుగే.. రూ. 345 రీఛార్జ్ ప్లాన్‌తో 60 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!

BSNL introduces new recharge plan that offers 1GB daily data for Rs 345

Updated On : September 28, 2024 / 6:18 PM IST

BSNL Recharge Plan : ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం కొత్త సరసమైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు తమ మొబైల్ టారిఫ్‌లను సగటున 15 శాతం వరకు పెంచిన తర్వాత ఈ ప్లాన్ ప్రవేశపెట్టింది.

ప్రైవేట్ కంపెనీలు ఇటీవలి టారిఫ్ ధరల పెంపు తర్వాత యూజర్ల కోసం కొత్తగా ప్లాన్ తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ధర రూ. 400 కన్నా తక్కువ, లాంగ్ టైమ్ వ్యాలిడిటీ అందిస్తుంది. ఫ్రీ కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Amazon Festival Sale 2024 : అమెజాన్ సేల్ ఆఫర్లు.. రూ. 20వేల లోపు టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

బీఎస్ఎన్ఎల్ రూ. 345 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ ద్వారా 60 రోజుల పాటు, ఫ్రీ కాలింగ్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లతో పాటు సుదీర్ఘమైన వ్యాలిడిటీని అందిస్తుంది. దాంతో పాటు, వినియోగదారులు 1జీబీ రోజువారీ డేటాను పొందవచ్చు. ఆ తర్వాత డేటా స్పీడ్ 40కేబీపీఎస్‌కి తగ్గుతుంది. బీఎస్ఎన్ఎల్ నుంచి ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ ఆఫర్ జియో, ఎయిర్‌టెల్, విఐ వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలకు సవాలుగా మారవచ్చు. ఎందుకంటే.. ప్రస్తుతం ఏ ఇతర కంపెనీ కూడా ఇంత సరసమైన రీఛార్జ్ ప్లాన్‌ను అందించలేదు.

బీఎస్ఎన్ఎల్ పోటీ ధరల సంఖ్య పెరుగుతున్న వినియోగదారులను ఆకర్షిస్తోంది. కంపెనీ యూజర్ బేస్ కోసం సరికొత్త ప్లాన్‌లను కూడా తీసుకొస్తోంది. ఫలితంగా, ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ జూలై 2024లో గణనీయమైన 29.4 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లను సంపాదించుకుంది. అయితే, ట్రాయ్ లేటెస్ట్ డేటా ప్రకారం.. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ కంపెనీలు పెద్ద సంఖ్యలో సబ్‌స్ర్కైబర్లను కోల్పోయాయి.

జియో 7లక్షల 50వేల మంది వినియోగదారులను కోల్పోయింది. ఎయిర్‌టెల్ 16.9 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. వోడాఫోన్ ఐడియా 14.1 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. కస్టమర్ బేస్‌లు వరుసగా 47.576 కోట్లు, 38.732 కోట్లు, 21.588 కోట్లకు తగ్గాయి. మరోవైపు, బీఎస్ఎన్ఎల్ 29.3 కోట్ల మంది వినియోగదారులను సంపాదించుకుంది.

బీఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారుల సంఖ్య 8.851 కోట్లకు పెరిగింది. ఈ మార్పుల ఫలితంగా, జూలైలో, జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కస్టమర్ మార్కెట్ వాటా మునుపటి నెలతో పోలిస్తే.. వరుసగా 40.68 శాతం, 33.12 శాతం, 18.46 శాతానికి తగ్గింది. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ మార్కెట్ వాటా 7.59 శాతానికి పెరిగింది.

Read Also : Tech Tips in Telugu : వాట్సాప్‌లో అదిరే ట్రిక్.. కాంటాక్టు సేవ్ చేయకుండానే మెసేజ్ పంపొచ్చు తెలుసా? ఇదిగో 5 సింపుల్ టిప్స్..!