తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం (జులై22, 2020) రాష్ట్రంలో 1,554 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 842 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 49,259 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ ప్రభావంతో ఇవాళ తొమ్మిది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 438కి చేరింది.
ఇవాళ 1,281 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం 37,666 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 11,155 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం 15,882 మందికి కొవిడ్-19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 2,93,077 మందికి టెస్టులు చేసినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.
బుధవారం రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్ జిల్లాలో 96, కరీంనగర్ లో 73, నల్లగొండలో 51, వరంగల్ అర్బన్ జిల్లాలో 38, వరంగల్ రూరల్ జిల్లాలో 36 కేసులు నమోదయ్యాయి. అలాగే, నిజామాబాద్లో 28, మెదక్లో 25, సంగారెడ్డిలో 24, పెద్దపెల్లిలో 23, ఖమ్మం, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 22 చొప్పున, వనపర్తిలో 21, రాజన్న సిరిసిల్లలో 18, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లో 14, మహబూబాబాద్ లో 11 కేసులు నమోదయ్యాయి.
ఆదిలాబాద్, యాదాద్రి భువనగిరి, ములుగు జిల్లాల్లో 8, జోగులాంబ గద్వాలలో 5, జగిత్యాల, మంచిర్యాలలో 3 చొప్పున, ఆసిఫాబాద్, సిద్దిపేటలో రెండు కేసుల చొప్పున, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి.