Wife Slits Husbands Throat : హన్మకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పసరగొండలో అనకాపల్లి పుష్ప ఘటన తరహాలో మరో దాడి జరిగింది. అయితే పుష్ప ఘటన వివాహానికి ముందే జరిగితే, ఈ ఘటన వివాహం అయిన మూడు వారాలకు జరిగింది. బ్లేడ్ తో నవవధువు భర్త రాజు గొంతు కోసింది. భార్య దాడిలో గాయపడిన భర్త రాజును చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పసరగొండ గ్రామానికి చెందిన రాజుకి యువతితో గత నెల 25న వివాహమైంది.
pushpa: ‘సర్ప్రైజ్’కు ముందు సెల్ఫీ.. ఫొటో వైరల్!
ఏం జరిగిందో కానీ, ఇవాళ నవవధువు బ్లేడ్ తో తన భర్త గొంతు కోసింది. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు 108 ద్వారా వరంగల్ ఎంజీఎంకు తరలించారు. యువతి గత కొన్ని రోజులుగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలే దాడికి కారణంగా తెలుస్తోంది. ఇద్దరి తల్లిదండ్రులు సర్ది చెప్పాలని చూస్తున్న క్రమంలో బ్లేడ్ తో దాడి ఘటన ఇరు కుటుంబాల్లో కలకలం రేపింది.
Pushpa Slits Fiance Throat : అందుకే.. పుష్ప తనకు కాబోయే భర్త గొంతు కోసింది-డీఎస్పీ సునీల్
సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. భార్య దాడిలో గాయపడిన భర్త ఆరోగ్యం నిలకడగానే ఉందంటున్నారు ఎంజీఎం వైద్యులు. ప్రస్తుతం కోలుకుంటున్నాడని, బాధితుడు రాజుకి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు అక్కడి వైద్యులు.
కాగా, ఏపీలోని అనకాపల్లి జిల్లా రావికమతంలో ఓ యువతి తనకు కాబోయే భర్త గొంతు కోసి చంపాలని చూసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. పెళ్లి ఇష్టం లేకనే కాబోయే భర్తపై యువతి పుష్ప ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. తానే కాబోయే భర్త గొంతు కోసినట్టు పుష్ప ఒప్పుకుంది. యువతికి ఎవరినీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, దైవ చింతనతో జీవితం గడపాలని భావిస్తోందని పోలీసులు వెల్లడించారు. ఓం శాంతి ఆశ్రమంలో గడపాలని ఆమె కోరుకుందని, అయితే, పెళ్లి చేసుకున్న తర్వాత ఆశ్రమంలో గడపడానికి పెద్దలు ఒప్పుకోరని భావించి కాబోయే భర్తను చంపాలని చూసిందని పోలీసులు వివరించారు. పుష్పపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు.