JP Nadda in Telangana: ‘ప్రజా గోస-బీజేపీ భరోసా’ పేరుతో బీజేపీ భారీ బహిరంగ సభ: హాజరు కానున్న జేపీ నడ్డా

ప్రజా గోస-బీజేపీ భరోసా పేరుతో నిర్వహించనున్న ఈ బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు.

JP Nadda in Telangana: తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజాసంగ్రామ యాత్ర నిర్విరామంగా కొనసాగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బండి సంజయ్ తలపెట్టిన యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. కేంద్రంలోని బీజేపీ అధిష్టానం సైతం సంజయ్ యాత్రను అభినందిస్తూ తమ వంతుగా ప్రజాసంగ్రామ యాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈక్రమంలో గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రజా గోస-బీజేపీ భరోసా పేరుతో నిర్వహించనున్న ఈ బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు.

Also Read:Police Humanity: అర్ధరాత్రి సైకిల్‌పై డెలివరీ బాయ్‌ని చూసి పోలీసులు ఏం చేశారో తెలుసా!

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి ప్రజాసంగ్రామ యాత్రలో కూడా నడ్డా పాల్గొననున్నారు. బహిరంగ సభ కంటే ముందుగా బీజేపీ ముఖ్య నేతలు, పదాధికారులతో జేపీ నడ్డా సమావేశం కానున్నారు. ఈసందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలు పార్టీ సంస్థాగత అంశాలపై నివేదిక ఇవ్వనున్నారు. ప్రజా సంగ్రామయాత్ర జరుగుతున్న తీరు, రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలపై నడ్డా విశ్లేషించనున్నారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న జేపీ నడ్డాకు హైదరాబాద్ నేతలు స్వాగతం పలకనున్నారు.

Also Read:Yadagirigutta : యాదగిరిగుట్టపైకి వెళ్లే వాహనదారులకు గూడ్ న్యూస్

అనంతరం అక్కడి నుంచి 2.30 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. 3 గంటలకు లంచ్ హాల్టింగ్ పాయింట్ వద్ద రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నేతలతో సమావేశంలో పాల్గొననున్నారు. 5 గంటలకు రైల్వే గెస్ట్ హౌస్‌కు..6 గంటలకు సభా స్థలికి చేరుకోనున్నారు నడ్డా. మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎంవీఎస్ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్‌లో బహిరంగ సభ జరగనుంది.

Also read:Ganta Srinivasa Rao : విశాఖ ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబుకు స్వాగతం పలికిన గంటా శ్రీనివాసరావు..

ట్రెండింగ్ వార్తలు