Thatikonda Rajaiah: ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. ఎమ్మెల్యే కడియంకు రాజయ్య వార్నింగ్

స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఉపముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు.

Thatikonda Rajaiah: ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. ఎమ్మెల్యే కడియంకు రాజయ్య వార్నింగ్

Thatikonda Rajaiah vs Kadiyam Srihari

Updated On : January 3, 2025 / 2:07 PM IST

Rajaiah Vs Kadiyam Srihari: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఉపముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. తీరుమార్చుకోకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు నిన్ను రోడ్లమీద తిరగనివ్వరు అంటూ శ్రీహరికి హెచ్చరికలు చేశాడు. గురువారం కడియం శ్రీహరి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం రాజయ్య మీడియాతో మాట్లాడుతూ కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Gossip Garage : రైతు కూలీలకు ఆర్థిక సాయం..! రేవంత్ సర్కార్ ముందున్న సవాళ్లు ఏంటి?

కడియం శ్రీహరి నీది నాలికా.. తాటి మట్టా.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నీచ సంస్కృతి నీది అంటూ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత మీద ఆయన చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు. పదేళ్లు ఆ కుటుంబంలో అంతరంగికుడిగా ఉన్నావ్ కదా.. కాంగ్రెస్ పార్టీలో చచ్చిన పాములా పడి ఉన్నావ్. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. లేకపోతే నిన్ను బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల మీద తిరగనివ్వరు అంటూ కడియం శ్రీహరిని హెచ్చరించారు. నమ్మకద్రోహానికి ప్రతిరూపం నువ్వు.. నీ ప్రవర్తన. నీ ద్రోహాన్ని చూసి కాంగ్రెస్ వాళ్లు కూడా దగ్గరకు రానివ్వడం లేదని రాజయ్య విమర్శించారు.

Also Read: Gossip Garage : బీజేపీలో అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు..! పార్టీపై పట్టు కోసం ఆ ఇద్దరి ప్రయత్నాలు..!

1994కు ముందు నీ ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎంత? 30ఏళ్లలో ఎలా కుబేరుడు అయ్యావు. నీ ఇళ్లు, దేవునూరు భూములు, పెట్రోల్ బంకులే నీ అవినీతికి సాక్ష్యం. విదేశాల్లో నీ ఆస్తులే సాక్ష్యం. ఇంకొకసారి నీతి నిజాయితీ గురించి మాట్లాడొద్దు అంటూ.. శ్రీహరిపై రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

కడియం ఏమన్నారంటే..
కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం మాట్లాడుతూ.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారు. ఫార్ములా ఈ- కార్ రేసులో కేటీఆర్ కూడా జైలుకు వెళ్తారని అన్నారు. కేసీఆర్ కుటుంబంలోని వారంతా నిజాయితీపరులే అయితే ఒక్కొక్కరిపై అన్ని కేసులు ఎందుకు ఉన్నాయనంటూ కడియం ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్, హరీశ్ రావు ఎన్నో తప్పులు చేశారు. దళితబంధు, రైతు బంధులో అవినీతి జరిగిందని కడియం ఆరోపించారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు కేసీఆర్, ఆయన కుటుంబంలోని వారి ఆస్తి ఎంత..? ఇప్పుడు ఎంత అంటూ కడియం ప్రశ్నించారు.