Banjarahills: బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘటన కలకలం రేపుతుంది. మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవర్.. ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
రెయిన్ బో హాస్పిటల్లో ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ వాసి ఆదిత్య రాయ్ (23), అసిస్టెంట్ కుక్గా ఒరిస్సాకు చెందిన దేవేందర్ దాస్ (29) పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి ఒకటిన్నర సమయంలో రోడ్ దాటుతుండగా మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న TS08HR3344 పోర్ష్ కారు వచ్చి ఢీకొట్టింది.
ఢీ కొట్టిన కార్ లో రోహిత్ గౌడ్(27),సుమన్(29)లు ఉన్నారు. డ్రైవింగ్ చేస్తున్న రోహిత్ 70శాతం ఆల్కహాల్ తీసుకున్నాడని, పక్కనే కూర్చొన్న సుమన్ 58శాతం ఆల్కహాల్ తీసుకున్నాడని రికార్డులు చెబుతున్నాయి.
Banjara Hills 1……………………………………….. : తెలంగాణలో ఒమిక్రాన్ కేసు నమోదు
ఆలివ్ విస్ట్రో పబ్ లో మధ్యం సేవించి అక్కడి నుండి బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్ వైపు వెళుతుండగా కారు ఇద్దరు వ్యక్తులను ఢీ కొట్టింది. వెంటనే పరారీ అయ్యేందుకు యత్నించగా జూబ్లీహిల్స్ పోలీసులు మార్గమధ్యలో ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అనంతరం బంజారాహిల్స్ పోలీసులకు కారు డ్రైవర్ ను అప్పగించారు.