ఆ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను మించి పోయిండు : ఈటల రాజేందర్

నా 20ఏళ్ల రాజకీయంలో ఇంతగా పొల్యూట్ అయిన రాజకీయాలను చూడలేదు. సీఎం రేవంత్ రెడ్డి భాష, ప్రవర్తన ఇంకా మారలేదని ఈటల రాజేందర్ అన్నారు.

Etela Rajender : లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గంలో బీజేపీ గెలుస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయని మాజీ మంత్రి, బీజేపీ మల్కాజిగిరి నియోజకవర్గం అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో ఈటల పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేస్తుంటే అనేక రకాలుగా విమర్శలు, వ్యతిరేకతలు వస్తాయని అన్నారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలియదని ప్రజలే అంటున్నారు. ఈసారి బీజేపీ అభ్యర్థినైన నా విజయాన్ని మల్కాజిగిరి ప్రజలు కోరుకుంటున్నారని,. అన్ని సర్వేలు బీజేపీదే విజయమని చెప్పేశాయని ఈటల తెలిపారు. 70రోజుల్లో మీకు ఓటు వెయ్యం అని చెప్పినవారు లేరు. అందరూ బీజేపీకి సానుకూలంగా ఉన్నారని ఈటల రాజేందర్ అన్నారు.

Also Read : Cm Revanth Reddy : ఈటల రాజేందర్, కేసీఆర్ వేర్వేరు కాదు- సీఎం రేవంత్ రెడ్డి

నా 20ఏళ్ల రాజకీయంలో ఇంతగా పొల్యూట్ అయిన రాజకీయాలను చూడలేదు. సీఎం రేవంత్ రెడ్డి భాష, ప్రవర్తన ఇంకా మారలేదు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం తప్ప కాంగ్రెస్ ఏ హామీని అమలు చేయలేదని ఈటల అన్నారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ విషయంలో తొందరగా చర్యలు తీసుకుంటారు అనుకున్నా.. కానీ, ఇంకా కొనసాగుతూనే ఉంది. మోసం చెయ్యడానికే కాంగ్రెస్ హామీలు ఇచ్చిందా.. తెలంగాణ ప్రజలే తేల్చుకోవాలని ఈటల అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటువేస్తే పెద్దగా ఉపయోగం లేదు. మార్ఫింగ్, మోసాలు చెయ్యడంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ను మించి పోయిండు. నాలుగు నెలల్లో రేవంత్ రెడ్డి అబద్ధాల కోరుఅని అర్ధమైందని ఈటల రాజేందర్ అన్నారు.

Also Read : Gudivada Amarnath : అందుకే.. జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు- మంత్రి గుడివాడ

 

ట్రెండింగ్ వార్తలు