కూకట్‌పల్లి డిగ్రీ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో కొత్త కోణం.. నిందితులు ముగ్గురూ మైనర్లే, అమ్మాయిని ఎలా అనుమతించారు, వెలుగులోకి OYO ఆనంద ఇన్‌ హోటల్‌ నిర్వాకం

  • Published By: naveen ,Published On : October 16, 2020 / 01:45 PM IST
కూకట్‌పల్లి డిగ్రీ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో కొత్త కోణం.. నిందితులు ముగ్గురూ మైనర్లే, అమ్మాయిని ఎలా అనుమతించారు, వెలుగులోకి OYO ఆనంద ఇన్‌ హోటల్‌ నిర్వాకం

Updated On : October 16, 2020 / 1:56 PM IST

kukatpally girl gang rape case: సంచలనం రేపిన హైదరాబాద్ కూకట్‌పల్లి అత్యాచారం ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓయో(oyo) హోటల్‌ నిర్వాకం బయటపడుతోంది. మైనర్లకు రూమ్‌ ఇవ్వకూడదన్న నిబంధనలున్నా హోటల్‌ సిబ్బంది పట్టించుకోలేదు. డిగ్రీ స్టూడెంట్‌పై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు మైనర్లకు ప్రత్యేక గదిని కేటాయించారు. ముగ్గురు మైనర్లతో పాటు ఓ యువతి ఉన్నా హోటల్‌ నిర్వాహకులు ప్రశ్నించలేదని తెలుస్తోంది.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఆనంద ఇన్ హోటల్:
కూకట్‌పల్లిలోని ఓయో ఆనంద ఇన్‌ హోటల్(hotel ananda inn)‌ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలు పట్టించుకోకుండా ఎవరికి పడితే వారికి గదులు కేటాయిస్తారని ఫైరవుతున్నారు. 10టీవీ సిబ్బంది హోటల్‌లో ఉండగానే ఓ జంట పరారు కావడం… హోటల్‌ నిర్వాహాకుల అక్రమాలకు అద్దం పడుతోంది.