Drunk and Drive: మందుబాబులకు పోలీసుల హెచ్చరిక.. దొరికితే 10 ఏళ్ల జైలు శిక్షే.. ఇవి కూడా తెలుసుకోండి!
నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలు(Drunk and Drive) తీసుకుంటున్నారు.
Police conducted a special weekend drunk-and-drive check in Hyderabad
- సైబరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్
- రెండు వందల ముప్పైఏడు కేసులు
- తప్పనిసరిగా పదేళ్ల జైలు శిక్ష
Drunk and Drive: నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడే ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తూ రూల్స్ బ్రేక్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సైబరాబాద్ (Hyderabad)పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ దొరికిపోయిన 237 మందిపై కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ ఏడీసీపీ జి. నరేందర్ అధికారికంగా వెల్లడించారు.
Electric Bus Routes: ఏపీ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆగస్టు 1 నుంచే ఆ సర్వీసులు షురూ
అత్యధికంగా ద్విచక్ర వాహనదారులే:
ఈ తనిఖీల్లో పట్టుబడిన వారిలో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులే ఉండటం గమనార్హం. మొత్తం 237 కేసులలో 205 ద్విచక్ర వాహనాలు, 28 కార్లు, 4 ఆటోలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బ్లడ్ ఆల్కహాల్ (Drunk and Drive)కాన్సన్ట్రేషన్ పరీక్షల ఆధారంగా ఈ కేసులను వర్గీకరించారు. వీరిలో 36 mg – 200 mg మధ్య 219 మంది, 201 mg – 300 mg మధ్య ఐదుగురు, 301 mg – 550 mg మధ్య అత్యధిక ఆల్కహాల్ శాతంతో 13 మంది పట్టుబడ్డారు. వీరందరినీ త్వరలోనే కోర్టులో హాజరుపరచనున్నారు.
మద్యం తాగి ప్రమాదానికి కారణమైతే 10 ఏళ్ల జైలు శిక్ష:
మద్యం తాగి వాహనం నడపడం తీవ్రమైన నేరమని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఒకవేళ మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, వారిపై కఠినమైన చట్టాల కింద చర్యలు ఉంటాయన్నారు. భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా కూడా విధిస్తారని, కాబట్టి వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు కోరారు.
