మీ ట్రైన్ టిక్కెట్టుకు డబ్బులు సోనియమ్మ ఇచ్చారు
‘మీ రైలు టికెట్టుకు డబ్బులు సోనియమ్మ ఇచ్చారు’ అని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసుకున్న ప్రచారం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. కరోనా సమయంలో నాయకులు చేస్తున్న పనులను నెటిజన్లు ఎండగట్టడం చూస్తూనే ఉన్నాం. ప్రచారం విపరీతంగా చేసుకుంటున్నారు నాయకులు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే అమరీందర్ రాజా వారింగ్ రైల్వే స్టేషన్లో వలస కూలీలకు కరపత్రాలు పంచడంతో నెట్టింట్లో వైరల్గా మారిపోయింది. పంజాబ్లోని భటిండా రైల్వే స్టేషన్లో వలస కూలీల రైలు బిహార్లోని ముజఫర్పూర్ బయల్దేరే ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే రైల్వే స్టేషన్కు తన అనుచరులతో వచ్చి వారు స్వస్థలాలకు వెళ్లేందుకు ఎవరు సాయం చేశారో వివరించాలని భావించారు. ఈ క్రమంలోనే వలస కూలీల ముందు ప్రసంగం ఇచ్చిన వారింగ్.. మీ టికెట్ డబ్బులను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీ, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, సునిల్ జాఖడ్ (పీసీసీ అధ్యక్షుడు) మిమ్మల్ని స్వస్థలాలకు పంపిస్తున్నారంటూ.. ప్రతిదీ ఆ కరపత్రంలో రాసి ప్రయాణిస్తున్న వారికి పంచారు. కరపత్రంలో ఆపత్కాలంలో కాంగ్రెస్ ముందుకొచ్చింది అనే హెడ్డింగ్ను కూడా పెట్టారు.
వలస కూలీల కోసం రైల్వేశాఖ ‘శ్రామిక్ ఎక్స్ప్రెస్’ రైళ్లను నడిపిస్తోండగా.. 85శాతం రుసుమును కేంద్రం భరిస్తుంది. 15శాతం మాత్రం రాష్ట్రాలు భరిస్తున్నాయి. ఒక్కో వ్యక్తికి రూ.50 చొప్పున రాష్ట్రాలే చెల్లించాలి.అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, “ముష్కిల్ దౌర్ మెయిన్ కాంగ్రెస్ నే హాయ్ హాత్ థామా” అని చదివిన ఎమ్మెల్యే.. కిటికీల ద్వారా కరపత్రాలను ఎమ్మెల్యే అందజేశారు.
Read More:
* వలస కార్మికులపై దూసుకెళ్లిన కార్లు
* ఇళ్లకు వెళ్లడం కంటే చావడమే బెటర్.. ఆకలి కడుపుతో మండుతున్న ఎండల్లో ప్రయాణం