TS Covid-19 Update : తెలంగాణలో కొత్తగా 151 కోవిడ్ కేసులు

తెలంగాణలో గడిచిన   24 గంటల్లో  కొత్తగా  151 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 190 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.

TS Covid-19 Update :  తెలంగాణలో గడిచిన   24 గంటల్లో  కొత్తగా  151 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 190 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 98.83 శాతంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ పేర్కొంది. దీంతో, రాష్ట్రంలో ఇంతవరకు 6,72,203 మందికి కొవిడ్ సోకగా, వారిలో 6,64,402 మంది కోలుకున్నారు.

ఇప్పటి వరకు కోవిడ్, తదితర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 3,963 కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,838 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇలా ఉండగా, GHMC పరిధిలో కొత్తగా 45 కోవిడ్ కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాల్లో 16, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 12 రంగారెడ్డి జిల్లాలో 10 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి.

Also Read : AP Covid Cases : ఏపీలో కొత్తగా 150 కోవిడ్ కేసులు

కాగా….వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, నిర్మల్, నారాయణపేట, మెదక్, జోగులాంబ గద్వాల, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

ట్రెండింగ్ వార్తలు