మున్సిపల్ ఫలితాలు : బోణి కొట్టిన బీజేపీ.. ఎక్కడ గెలిచిందంటే..

తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎట్టకేలకు బీజేపీ బోణీ కొట్టింది. ఓవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు మీదుంటే.. విపక్షాలు మాత్రం బోణీ కొట్టడానికి కూడా ఇబ్బంది పడ్డాయి.

  • Published By: veegamteam ,Published On : January 25, 2020 / 05:16 AM IST
మున్సిపల్ ఫలితాలు : బోణి కొట్టిన బీజేపీ.. ఎక్కడ గెలిచిందంటే..

Updated On : January 25, 2020 / 5:16 AM IST

తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎట్టకేలకు బీజేపీ బోణీ కొట్టింది. ఓవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు మీదుంటే.. విపక్షాలు మాత్రం బోణీ కొట్టడానికి కూడా ఇబ్బంది పడ్డాయి.

తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎట్టకేలకు బీజేపీ బోణీ కొట్టింది. ఓవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు మీదుంటే.. విపక్షాలు మాత్రం బోణీ కొట్టడానికి కూడా ఇబ్బంది పడ్డాయి. టీఆర్ఎస్ 15 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు కైవసం చేసుకుని దూసుకుపోతుంటే.. కాంగ్రెస్, బీజేపీ వెనుకబడ్డాయి.

ఎట్టకేలకు కాంగ్రెస్, బీజేపీ బోణీ కొట్టాయి. నారాయణ్ ఖేడ్, వడ్డేపల్లి, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అమన్ గల్ మున్సిపాలిటీలో కమలం వికసించింది. ఈ మున్సిపాలిటీలో మెజారిటీ వార్డులు బీజేపీ దక్కించుకుంది.

కాంగ్రెస్, బీజేపీ బోణీతో ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. నారాయణ్ ఖేడ్ లో కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్య హోరాహోరి పోరు నడిచింది. నారాయణ్ ఖేడ్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 8 వార్డుల్లో, 7 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు.

శనివారం(జనవరి 25,2020) ఉదయం 8 గంటలకు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 134 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి వార్డుకు రెండు టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నంలోపు ఫలితాలు వెలువడనున్నాయి. మొద‌ట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్ పత్రాలను పార్టీల వారిగా విభ‌జించి బండిల్‌గా కట్టి.. లెక్కిస్తున్నారు.

120 మున్సిపాలిటీలు.. 9 కార్పొరేషన్లలో 12వేల 926 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి కూడా టీఆర్ఎస్ జోరు స్పష్టంగా కనిపించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తొలి బోణీ కొట్టింది టీఆర్ఎస్సే. తొలుత పరకాల, చెన్నూరు మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చెన్నూరులో మొత్తం 18 వార్డులను దక్కించుకుంది. పరకాలలో మొత్తం 22 వార్డులు కైవసం చేసుకుంది.