Telangana Corona Cases Report : తెలంగాణలో కొత్తగా 40 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. అయితే, క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి.(Telangana Corona Cases Report)

Telangana Covid Report

Telangana Corona Cases Report : తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. అయితే, క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 19వేల 052 కరోనా పరీక్షలు నిర్వహించగా, 40 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 21 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 35 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు.

తెలంగాణలో ఇప్పటిదాకా 7,91,253 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,86,680 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 462 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో 4,111 మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజుతో(32) పోలిస్తే కరోనా కేసులు పెరిగాయి. 18వేల 246 కరోనా పరీక్షలు నిర్వహించగా, 32 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(Telangana Corona Cases Report)

India Covid-19 : కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం.. మార్చి 31 నుంచి దేశ వ్యాప్తంగా కొవిడ్ నిబందనలు పూర్తిగా ఎత్తివేత

అటు దేశంలోనూ కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. మహమ్మారి వ్యాప్తి గణనీయంగా తగ్గుతూ ఊరటనిస్తోంది. తాజాగా 6.24 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,233 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు దిగువకు, పాజిటివిటీ రేటు ఒక శాతం లోపునే నమోదవుతున్నాయి.

24 గంటల వ్యవధిలో మరో 31 మంది కొవిడ్ తో మరణించారు. నిన్న 1,876 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.75 శాతానికి పెరిగింది. తాజాగా యాక్టివ్ కేసులు ఇంకాస్త తగ్గి, 15 వేల దిగువకు చేరాయి. దాంతో యాక్టివ్ కేసుల రేటు 0.03 శాతానికి క్షీణించింది. ఇప్పటివరకు దేశంలో 4.30 కోట్ల కరోనా కేసులు రాగా.. 5.21 లక్షల మంది మరణించారు. కరోనా వ్యాప్తి కట్టడికి కేంద్రం మొదలు పెట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగుతోంది. ఇప్పటివరకు 183 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 26.34 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.(Telangana Corona Cases Report)

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కొవిడ్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అయితే మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారమిచ్చారు.

Covid Vaccine: భారత్ లో 12-18 ఏళ్ల వారికి అత్యవసర వినియోగ నిమిత్తం నోవావాక్స్ కు డీజీసీఐ అనుమతి

దేశంలో కొవిడ్ విజృంభించడంతో దాదాపు రెండేళ్ల క్రితం వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కొవిడ్ కట్టడి కోసం 2020 మార్చి 24న విపత్తు నిర్వహణ చట్టం కింద తొలిసారిగా ఈ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ఆ తర్వాత కేసుల సంఖ్యను బట్టి పలుమార్లు వీటిలో మార్పులు, చేర్పులు చేసింది. అయితే, గత ఏడు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను పూర్తిగా తొలగించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.