COVID 19 in Telangana : తెలంగాణాలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒక్కరకంగా తగ్గుముఖం పట్టాయనే చెప్పవచ్చు. ప్రస్తుతం రెండు వేల లోపే పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 2,072 కేసులు నమోదయితే..2,259 మంది కరోనా నుంచి కోలుకున్నారు. . ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,89,283 కేసులు నమోదు అయ్యాయి.
కరోనాతో 9మంది మరణించారు. ఇప్పటి వరకు 1116 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 29,477 గా ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ వెల్లడించింది. తెలంగాణాలో ఇప్పటి వరకు 1,58,690 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 83.83% శాతంగా ఉంది. మరణాలు 0.58 శాతంగా ఉంది. 54,308 పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 29,40,642పరీక్షలు చేశారు.
జిల్లాల వారీగా కేసులు :
ఆదిలాబాద్ 19. భద్రాద్రి కొత్తగూడెం 85. జీహెచ్ఎంసీ 283. జగిత్యాల 43. జనగామ 28. జయశంకర్ భూపాలపల్లి 27. జోగులాంబ గద్వాల 21. కామారెడ్డి 44. కరీంనగర్ 109. ఖమ్మం 83. కొమరం భీం ఆసిఫాబాద్ 24. మహబూబ్ నగర్ 44.
మహబూబాబాద్ 60. మంచిర్యాల 36. మెదక్ 25. మేడ్చల్ మల్కాజ్ గిరి 160. ములుగు 23. నాగర్ కర్నూలు 34. నల్గొండ 139. నారాయణపేట 16. నిర్మల్ 26. నిజామాబాద్ 72. పెద్దపల్లి 49. రాజన్న సిరిసిల్ల 53. రంగారెడ్డి 161. సంగారెడ్డి 32. సిద్దిపేట 78. సూర్యాపేట 72. వికారాబాద్ 17. వనపర్తి 41. వరంగల్ రూరల్ 33. వరంగల్ అర్బన్ 85. యాదాద్రి భువనగిరి 41. మొత్తం : 2072.