తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్.. ఈ ప్రాంతాల వారు జాగ్రత్త
పలు ప్రాంతాల్లో గంటకు 30 - 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు.
పలు ప్రాంతాల్లో గంటకు 30 – 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుందని అన్నారు.
Also Read: దీపావళికి బోనస్ ఇవ్వలేదని రచ్చ రచ్చ చేసిన ఉద్యోగులు.. చివరకు కంపెనీ ఏం చేసిందో తెలుసా?
ఇవాళ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మాల్కాజ్గిరి, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, కొత్తగూడెం, ఖమ్మం సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
మరోవైపు, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిన్న వర్షాలు పడ్డాయి. పంజాగుట్ట, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, తార్నాక, మల్లాపూర్లో వర్షాలు కురిశాయి. తార్నాక – ఉప్పల్కు రహదారిపై నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం పడుతున్న సమయంలో మెట్రో పిల్లర్ల కింద వాహనదారులు కాసేపు ఆగివెళ్లారు.