మోడీ 69వ పుట్టిన రోజు : ఢిల్లీ నుంచి వాడ్నగర్ వరకు బైక్ ర్యాలీ
ప్రధాని నరేంద్ర మోడీ 69వ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 20 వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ 69వ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 20 వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ 69వ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 20 వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. మోడీ సామాజిక సందేశాలను వ్యాప్తి చేసేందుకు గుజరాత్లోని మోడీ జన్మస్థలమైన వాడ్నగర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తారు.
అశోక్ రోడ్లోని తన నివాసం దగ్గర రాజ్ లక్ష్మి సహా ఇతర బైకర్ల ర్యాలీని బీజేపీ ఎంపీ విజయ్ గోయెల్ జెండా ఊపి ఆవిష్కరించారు. ఏస్ బైకర్ రాజ్ లక్ష్మి నేతృత్వంలో సెప్టెంబర్ 20న నాలుగు రాష్ట్రాల మీదుగా 1,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బైక్ ర్యాలీ వాడ్నగర్ చేరుకోనుంది.
మోడీ సామాజిక సందేశాల్లో ప్రధానమైన స్వచ్ఛ్ భారత్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వంటి సందేశాలను వ్యాప్తి చేసి యువకుల్లో స్ఫూర్తిని ప్రేరేపించడంలో రాజ్ లక్ష్మి ప్రధాన కర్తవ్యమని గోయెల్ అన్నారు. సెప్టెంబర్ 17న మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 20 వరకు బిజెపి ‘సేవా సప్తా’ (సేవా వారం) పాటించనుంది.
న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్లో బిజెపి అధ్యక్షుడు అమిత్ షాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా, విజయ్ గోయెల్, విజయేందర్ గుప్తాలతో కలిసి సేవా సప్తా ప్రారంభించారు.