తినే పదార్థం అనుకుని బాంబును కొరికిన ఎద్దు.. తర్వాత ఏమైందంటే?

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కృష్ణాపురంలో మేతకు వెళ్లిన ఎద్దు తినే పదార్ధం అనుకుని నాటు బాబును కొరకడంతో అది ఒక్కసారిగా పేలింది. కౌండిన్య అటవీ ప్రాంతానికి మేతకోసం వెళ్లిన ఎద్దు, వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన నాటుబాంబును కొరకగా ఈ ఘటన చోటుచేసుకుంది.
బాంబు పేలడంతో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చింది. అప్పుడు అక్కడకు వెళ్లి చూసినవారికి ఎద్దు దవడలు పూర్తిగా పేలిపోయి చర్మం వేలాడుతూ కనిపించింది. ఆ సమయంలో పక్కన జంతువులు కానీ, మనుషులు కానీ లేరు.
అనంతరం యజమాని, ఎద్దును గ్రామానికి తోలుకొచ్చాడు. వేటగాళ్లు ఈ ప్రాంతంలో దుప్పుల కోసం అమర్చిన ఉంటను తినడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మైలేరు పండుగల్లో పలు బహుమతులు గెలిచిన ఈ ఎద్దు విలువ లక్షకు పైగా ఉంటుందని రైతు చెబుతున్నాడు.