జనసేన జోరు : పాలకొల్లులో పవన్- అల్లు అర్జున్ ప్రచారం

  • Published By: veegamteam ,Published On : April 9, 2019 / 07:39 AM IST
జనసేన జోరు : పాలకొల్లులో పవన్- అల్లు అర్జున్ ప్రచారం

ఏపీలో ప్రచారం క్లయిమాక్స్ కు వచ్చింది. పార్టీల అధినేతలు అందరూ హోరాహోరీగా తిరుగుతున్నారు. ఇక జనసేన అధినేత, మామయ్య పవన్ కల్యాణ్ తో కలిసి వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రచారంలో పాల్గొన్నారు. అల్లును చూడగానే కార్యకర్తలు, అభిమానుల్లో జోష్ కనిపించింది. జనసేన పార్టీని బలపరచాలని కోరారు బన్నీ.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు జీతాలు పెంచనున్నట్లు హామీ ఇచ్చారు పవన్. దీని కోసం న్యూ పే కమిషన్ ను ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి.. పాత పద్దతిలోనే పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేస్తామన్నారు. అన్ని డిపార్ట్ మెంట్స్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు పవన్.

ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రతీ టౌన్ సిటీలో సెల్స్ ఫైనాన్సింగ్ మోడల్ హౌసింగ్ బోర్డులు ఏర్పాటు చేసి ఇళ్లు కట్టించనున్నట్లు ప్రకటించారు. ఎడ్యుకేషన్ రిఫామ్స్ కమిషన్ ఏర్పాటు చేసి టీచర్లు.. విద్యార్ధుల కోసమే పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. టీచర్స్ కేవలం విద్యార్ధుల కోసమే పనిచేయాలి తప్ప ఏ పార్టీల నాయకుల కోసం పనిచేయకూడదని కఠిన నిబంధం అమలు చేస్తామన్నారు పవన్. పాలకొల్లు వాసుల నీటి కష్టాలకు విజ్జేశ్వరం నుంచి నీటిని తరలించి నీటి కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. యలమంచిలి ప్రాంతాల్లోని పొలాలకు సాగునీరు అందించి రెండో పంట పండేలా చర్యలు తీసుకుంటామన్నారు.