దొంగల్ని తరుముతుండగా ఢీకొన్న రైలు : చెన్నైలో అనంతపురం యువకులు మృతి 

  • Published By: veegamteam ,Published On : November 27, 2019 / 04:49 AM IST
దొంగల్ని తరుముతుండగా ఢీకొన్న రైలు : చెన్నైలో అనంతపురం యువకులు మృతి 

అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు చెన్నైలో మృతి చెందారు. విధులల్లో భాగంగా ప్రాణాలకు తెగించి దొంగల్ని పట్టుకునేందుకు యత్నించిన ఇద్దరు యువకులు చెన్నైలో మరణించిన అత్యంత విషాకరమైన  ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఇద్దరు యువకులు చెన్నైవెళ్లారు. పొట్టకూటికోసం వెళ్లినవీరిద్దరు పనులు చేస్తున్నారు.

ఈ క్రమంలో రైల్వే వస్తువుల్ని దొంగిలించటానికి ఇద్దరు దొంగలు వచ్చారు.వారిని పట్టుకోవటానికి ఈ ఇద్దరు యువకులు యత్నించారు. దొంగల్ని పట్టుకోవాలనే ఉద్ధేశ్యంతో దొంగల్ని తరుముకుంటు వెళ్లారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న రైలును వారి గమనించిలేదు. వేగంగా వచ్చిన రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు.  

ఈ విషాద ఘటనతో అనంతపురం జిల్లా కదిరిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పొట్టకూటికోసం వెళ్లిన ఇద్దరుయువకులు మృతి చెందటంతో రెండు కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.