నాగార్జున సాగర్ నుంచి సోమశిలకు నీరు తీసుకొస్తా 

  • Published By: veegamteam ,Published On : April 3, 2019 / 09:18 AM IST
నాగార్జున సాగర్ నుంచి సోమశిలకు నీరు తీసుకొస్తా 

రాబోయే రోజుల్లో నాగార్జున సాగర్ నుండి సోమశిల ప్రాజెక్టుకు నీరు తీసుకొస్తానని నెల్లూరు జిల్లా కావలిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు హామీ ఇచ్చారు. సోమశిలకు నీరొస్తే నెల్లూరు జిల్లా రైతుల నీటి సమస్యలు తీరిపోతాయన్నారు. అలా జరగాలంటే టీడీపీని గెలిపిస్తే ఇది సాధ్యమవుతుందన్నారు. తన నియోజక వర్గమైన కుప్పం కంటే పులివెందులకు సాగునీరు అందించిన ఘనత టీడీపీదేనన్నారు చంద్రబాబు. 2014 ఎన్నికల్లో టీడీపీ నెల్లూరు జిల్లా నుండి మూడు సీట్లే వచ్చాయనీ కానీ ఈ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందాలంటే మరిన్ని సీట్లు వచ్చేలా ప్రతీ ఒక్కరు ఓటు వేయాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. 
 

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతీ ఎమ్మెల్యే సీట్ల నుంచి మున్సిపల్, పంచాయితీ వంటి అన్ని ఎన్నికల్లోను టీడీపీకి పట్టం కట్టిందనీ అంటువంటి పశ్చిమ గోదావరి జిల్లా లాగానే నెల్లూరు జిల్లా కూడా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ప్రతీ ఇంటి సమస్యలు తీర్చేందుకు కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉండి కృషి చేస్తానన్నారు.  ఇలా అన్ని జిల్లాలు తమకు సమామేనని అది ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. నెల్లూరును మరో హైదరాబాద్ గా తీర్చి దిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.