కోడెలకు ధైర్యం చెప్పా.. వైసీపీ వేధించింది: చంద్రబాబు

  • Published By: vamsi ,Published On : September 30, 2019 / 02:04 PM IST
కోడెలకు ధైర్యం చెప్పా.. వైసీపీ వేధించింది: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దివంగత కోడెల శివప్రసాద్ రావు సంస్మరణ సభను గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించారు తెలుగుదేశం నేతలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కోడెల విగ్రహానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు.

అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. కేవలం రూ. లక్ష కోసం కోడెల కక్కుర్తిపడ్డారంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఫర్నిచర్ కేసు పెట్టి వేధించారని ఆరోపించారు చంద్రబాబు. కోడెలపై తప్పుడు కేసులు పెట్టి ఆయన చనిపోయేవరకు హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు.

కోడెలపై కేసులు పెట్టిన విషయం తెలిసి ఆయనను ఓదార్చానని, ధైర్యం చెప్పానని, వైసీపీ మాత్రం రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ ఇప్పుడు నీతులు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పోలీసులను వాడుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పల్నాటిపులిగా పేరుగాంచిన కోడెల మృతిచెందిన విధానం జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు.